2025 National Rewind: ఈ ఏడాది జాతీయంగా చరిత్ర సృష్టించిన నారీమణులు వీరే!
- మరికొన్ని గంటల్లో 2025 సంవత్సరానికి గుడ్బై
- ఈ ఏడాది చరిత్ర సృష్టించిన నారీ శక్తులు
- ప్రపంచ కప్ను ముద్దాడిన భారత మహిళా క్రికెటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరికొన్ని గంటల్లో 2025 సంవత్సరానికి గుడ్బై చెప్పనున్నారు. 2026 సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. ఇలాంటి సమయంలో ఈ ఏడాది జాతీయంగా అనేక సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా మహిళా మణులు చరిత్ర సృష్టించారు. వారి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కల్నల్ సోఫియా ఖురేషి
కల్నల్ సోఫియా ఖురేషి పేరు ఈ ఏడాది మార్మోగింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మే 7న పాకిస్థాన్పై భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్కు కల్నల్ సోఫియా ఖురేష్ నాయకత్వం వహించారు. అలా సోఫియా ఖురేషి వెలుగులోకి వచ్చారు. దేశమంతా ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం

హర్మన్ ప్రీత్ కౌర్
హర్మన్ ప్రీత్ కౌర్.. భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్. ఈ ఏడాది ఆమె ఆధ్వర్యంలో మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. వన్డే మహిళల ప్రపంచ కప్ను ముద్దాడింది. జట్టును ముందుండి నడిపించి కప్ సాధించింది. దీంతో హర్మన్ ప్రీత్ కౌర్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది.

జెమిమా రోడ్రిగ్స్
ఇక హర్మన్ ప్రీత్ కౌర్లాగానే.. ఈ ఏడాది మహిళల క్రికెట్ జట్టులో జెమిమా రోడ్రిగ్స్ పేరు కూడా జాతీయంగా.. అంతర్జాతీయంగా బాగా మార్మోగింది. వన్డ్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై వీర బాదుడు బాదింది. నాటౌట్గా నిలిచి ఫైనల్కు చేర్చింది. దీంతో ఆమె పేరు సోషల్ మీడియాలోనూ.. మీడియా ఛానల్స్లోనూ ఆమె పేరు ఎక్కువగా వినిపించింది.

రేఖా గుప్తా
రేఖా గుప్తా.. ఢిల్లీ ముఖ్యమంత్రి. ఈ ఏడాది దేశ రాజధానిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగరేసింది. అనూహ్యంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాను ముఖ్యమంత్రి పదవి వరించింది. బీజేపీ అధిష్టానం సీనియర్లను పక్కనపట్టి రేఖా గుప్తాకు అవకాశం ఇచ్చారు. ఇలా రేఖా గుప్తా పేరు కూడా చరిత్ర సృష్టించారు.

మైథిలి ఠాకూర్
మైథిలి ఠాకూర్.. జానపద గాయని. ప్రధాని మోడీ చేత ప్రశంసలు అందుకుంది. అనూహ్యంగా ఈ ఏడాది రాజకీయాల్లోకి ప్రవేశించి అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొందింది. నవంబర్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలీనగర్ నుంచి పోటీ చేసి మైథిలి ఠాకూర్ విక్టరీ సాధించారు. ఇలా అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించింది.

తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!