Rajasthan: ఉదయ్పూర్ మత ఘర్షణలకు కారణమైన ఘటనలో బాలుడు మృతి..
- ఉదయ్పూర్ మతహింసకు దారి తీసిన ఘటనలో బాలుడు మృతి..
- శుక్రవారం తోటి విద్యార్థిపై మరో విద్యార్థి దాడి..
- ఇరువర్గాలకు చెందిన విద్యార్థులు కావడంతో మత ఘర్షణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ రాజస్థాన్ ఉదయ్పూర్లో మత ఘర్షణలకు కారణమైంది. ప్రభుత్వ పాఠశాలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడు దేవరాజ్ అనే బాలుడిపై మైనారిటీ వర్గానికి చెందిన మరో బాలుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన తర్వాత నగర వ్యాప్తంగా మతపరమైన హింస చోటు చేసుకుంది. గాయపడిన బాలుడు నాలుగు రోజుల చికిత్స తర్వాత ఈ రోజు మరణించాడు.
నాలుగు రోజుల పాటు ప్రాణాల కోసం పోరాడిన తర్వాత సోమవారం మరణించాడు. బాలుడు తుదిశ్వాస విడిచే కొన్ని గంటల ముందు అతని సోదరి రక్షాబంధన్ సందర్భంగా ఆస్పత్రిలో రాఖీ కట్టిందని ఉదయ్పూర్ కలెర్టర్ అరవింద్ పోస్వాల్ తెలిపారు. ప్రస్తుతం బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని ఉదయ్పూర్ రేంజ్ ఐజీ అజయ్ పాల్ లాంబా తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. ఈ ఘటనలో నేరానికి పాల్పడిన నిందితుడి ఇంటిని అధికారులు కూల్చేశారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
Read Also: Crime News: రాఖీ కోసం ఇంటికి వచ్చిన యువకుడిని గన్తో కాల్చి చంపిన దుండగులు..
ఇదిలా ఉంటే శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా బలగాలను మోహరించారు. నగరంలోని సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను పెట్టారు. శుక్రవారం ఏదో గొడవలో పాఠశాల వెలుపల దేవరాజ్ అనే విద్యార్థిని తోటి విద్యార్థి కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో దాడి చేసిన వ్యక్తి మైనారిటీ కావడం, గాయపడిన వ్యక్తి మెజారిటీ వర్గం కావడంతో ఒక్కసారిగా నగరంలో మతపరమైన హింస చోటు చేసుకుంది. ఈ ఘటనను నిరసిస్తూ హిందూ సంఘాల సభ్యులు ఆందోళనకు దిగారు. ఘర్షణలు పెరగడంతో కార్లు, బైకులకు నిప్పటించారు. మాల్స్పై రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో ఘర్షణల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలను మూసివేసి, మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసారు. అలాగే నగరంలో ప్రజలు గుమిగూడడాన్ని నిషేధిస్తూ నిషేధాజ్ఞలు విధించారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!