Rajasthan: ఉదయ్పూర్ మత ఘర్షణలకు కారణమైన ఘటనలో బాలుడు మృతి..
- ఉదయ్పూర్ మతహింసకు దారి తీసిన ఘటనలో బాలుడు మృతి..
- శుక్రవారం తోటి విద్యార్థిపై మరో విద్యార్థి దాడి..
- ఇరువర్గాలకు చెందిన విద్యార్థులు కావడంతో మత ఘర్షణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ రాజస్థాన్ ఉదయ్పూర్లో మత ఘర్షణలకు కారణమైంది. ప్రభుత్వ పాఠశాలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడు దేవరాజ్ అనే బాలుడిపై మైనారిటీ వర్గానికి చెందిన మరో బాలుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన తర్వాత నగర వ్యాప్తంగా మతపరమైన హింస చోటు చేసుకుంది. గాయపడిన బాలుడు నాలుగు రోజుల చికిత్స తర్వాత ఈ రోజు మరణించాడు.
నాలుగు రోజుల పాటు ప్రాణాల కోసం పోరాడిన తర్వాత సోమవారం మరణించాడు. బాలుడు తుదిశ్వాస విడిచే కొన్ని గంటల ముందు అతని సోదరి రక్షాబంధన్ సందర్భంగా ఆస్పత్రిలో రాఖీ కట్టిందని ఉదయ్పూర్ కలెర్టర్ అరవింద్ పోస్వాల్ తెలిపారు. ప్రస్తుతం బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని ఉదయ్పూర్ రేంజ్ ఐజీ అజయ్ పాల్ లాంబా తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. ఈ ఘటనలో నేరానికి పాల్పడిన నిందితుడి ఇంటిని అధికారులు కూల్చేశారు.
Also Read
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
- Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
- CM Vijay Tiruchi Speech: తన డ్రెస్సింగ్ స్టైల్పై ట్రోల్స్ చేసినోళ్లకు సీఎం విజయ్ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్.. !
- Mamata Banerjee: నాతో ఆడుకుంటున్నారు.. నాకు టైమొచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది.. బీజేపీకి మమత హెచ్చరిక
Read Also: Crime News: రాఖీ కోసం ఇంటికి వచ్చిన యువకుడిని గన్తో కాల్చి చంపిన దుండగులు..
ఇదిలా ఉంటే శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా బలగాలను మోహరించారు. నగరంలోని సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను పెట్టారు. శుక్రవారం ఏదో గొడవలో పాఠశాల వెలుపల దేవరాజ్ అనే విద్యార్థిని తోటి విద్యార్థి కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో దాడి చేసిన వ్యక్తి మైనారిటీ కావడం, గాయపడిన వ్యక్తి మెజారిటీ వర్గం కావడంతో ఒక్కసారిగా నగరంలో మతపరమైన హింస చోటు చేసుకుంది. ఈ ఘటనను నిరసిస్తూ హిందూ సంఘాల సభ్యులు ఆందోళనకు దిగారు. ఘర్షణలు పెరగడంతో కార్లు, బైకులకు నిప్పటించారు. మాల్స్పై రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో ఘర్షణల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలను మూసివేసి, మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసారు. అలాగే నగరంలో ప్రజలు గుమిగూడడాన్ని నిషేధిస్తూ నిషేధాజ్ఞలు విధించారు.
తాజావార్తలు
-
Anantha Sriram : పెద్ది సినిమాలో కధే పెద్ద హీరో !
-
IPL 2026: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర కలకలం.. ఆర్సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్పై భారీ జరిమానా, నిషేధం..
-
Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్
-
Virat Kohli: ‘చెయ్యి దించు.. లేదంటే కొట్టేస్తా’.. కృనాల్ పాండ్యాపై కోహ్లీ ఆగ్రహం..
-
Priyanka Mohan: గ్లోబల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ బ్యూటీ రచ్చ.. కొరియా పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రియాంక మోహన్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!