Rajasthan: శ్రీకృష్ణ టెంపుల్కు రికార్డ్ విరాళాలు.. కేజీ గోల్డ్, రూ.23 కోట్ల నగదు
- రాజస్థాన్లోని ఓ ప్రముఖ శ్రీకృష్ణుడి ఆలయానికి భారీ విరాళాలు
- కేజీ గోల్డ్, రూ.23 కోట్ల నగదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని ఓ ప్రముఖ శ్రీకృష్ణుడి ఆలయానికి భారీ స్థాయిలో విరాళాలు వచ్చాయి. ఆలయ అధికారులే షాక్ అయ్యేలా విరాళాలు రావడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆలయంలో రెండు నెలల తర్వాత అధికారులు హుండీ లెక్కింపు చేపట్టగా కిలో బంగారు బిస్కెట్లు, రూ.23 కోట్లకు పైగా నగదు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Volkswagen Cars: కారు కొనేవారికి శుభవార్త.. ఈ కారుపై భారీ తగ్గింపు ధరలు
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
రాజస్థాన్లోని చిత్తోర్గఢ్లో కృష్ణ భగవానుడికి అంకితం చేయబడిన ప్రఖ్యాత ఆలయం ఇది. తమ కోర్కెలు నెరవేరుతాయన్న ఆశతో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే వచ్చిన భక్తులు విలువైన కానుకలు సమర్పిస్తుంటారు. అయితే ఈసారి ఎన్నడూ లేనంతగా అపూర్వమైన కానుకలు రావడం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. రెండు నెలల తర్వాత హుండీ లెక్కించగా.. కిలో బంగారు బిస్కెట్లు, వెండి కళాఖండాలు, వెండి పిస్టల్, వెండి తాళం-కీ, వేణువులు వంటి ప్రత్యేకమైన వస్తువులు, రూ.23 కోట్ల నగదు విరాళంగా వచ్చాయి. ఆలయం ప్రారంభం తర్వాత ఇంత మొత్తంలో కానుకలు రావడం ఇదే తొలిసారి అని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇంకా లెక్కింపు కొనసాగుతోంది. బంగారం, వెండి వస్తువులు, హుండీల నుంచి సేకరించిన వివిధ వస్తువులను తూకం వేసి వాటి విలువను లెక్కకట్టనున్నారు.
ఇది కూడా చదవండి: Pragya Nagra leaked Video: టాలీవుడ్ హీరోయిన్ వీడియోలు లీక్
చిత్తోర్గఢ్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో చిత్తోర్గఢ్-ఉదయ్పూర్ హైవేపై ఉన్న ఆలయం వైష్ణవ భక్తులకు కీలకమైన పుణ్యక్షేత్రం. సంవత్సరాలుగా ఈ ఆలయం అత్యంత గౌరవనీయమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా మారింది. స్థానిక విశ్వాసాల ప్రకారం ప్రఖ్యాత హిందూ కవయిత్రి మరియు ఆధ్యాత్మికవేత్త మీరాబాయి కూడా ఈ ఆలయంలో ప్రార్థనలు చేసినట్లుగా చెబుతుంటారు.
ఇది కూడా చదవండి: Mamta Kulkarni: 25 ఏళ్ల తర్వాత భారత్కు వచ్చిన అలనాటి బాలీవుడ్ నటి మమత.. భావోద్వేగంతో కంటతడి
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!