India vs New Zealand: 2016, 2021, 2023 చేదు జ్ఞాపకాలు.. గతంలో చేసిన ఈ 3 తప్పులు మళ్ళీ చేస్తే కప్పు కష్టమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs New Zealand: నేడు న్యూజిలాండ్ vs ఇండియా తుది పోరుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం సిద్ధమైంది. కోట్లాది మంది ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి అందరూ టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోనున్నారు. ఈ కప్పు ఎలాగైనా టీమిండియా కైవసం చేసుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. మరో వైపు.. ఇంత వరకు టీ20 కప్పును కూడా సొంతం చేసుకోని న్యూజిలాండ్ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని ప్లాన్ చేస్తోంది. ఇక టీమిండియా ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ మ్యాచుల్లో న్యూజిలాండ్పై మూడు సార్లు ఓడిపోయింది. ఎపుడు ఎలా ఓడింది. ఈ మూడు సందర్భాల్లో ఎలాంటి తప్పులు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Dhurandhar 2 :ధురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ సెన్సేషన్!
Also Read
- Telangana Civil Supplies: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 31 వరకే ఛాన్స్!
- కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
- Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత.. 7000 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
- Rega Kantha Rao: "పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు".. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు
2021లో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో భారత్ బ్యాటింగ్ ఆర్డర్ను మార్చి అతిపెద్ద పొరపాటు చేసింది. ఆ మ్యాచ్లో రోహిత్ శర్మను మూడో స్థానంలో పంపింది. ఇషాన్ కిషన్కు ఓపెనర్గా అవకాశం ఇచ్చింది. ఆ నిర్ణయం జట్టుపై ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా భారత్ కేవలం 110 పరుగులకే పరిమితమైంది. ఈసారి కూడా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్పై సందేహాలు ఉన్నప్పటికీ ఫైనల్ వంటి కీలక మ్యాచ్లో బ్యాటింగ్ బ్యాటింగ్ ఆర్డర్ను మార్చడం ప్రమాదకరంగా భావిస్తున్నారు. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగితే మంచిదని అందరూ భావిస్తున్నారు.
READ MORE: Team India playing XI: వరుణ్, అభిషేక్ విషయంలో సంచలన నిర్ణయం.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ లీక్!
ఇక న్యూజిలాండ్ స్పిన్నర్లు భారత్పై ఎప్పుడూ మంచి ప్రదర్శన చేస్తుంటారు. 2016 ప్రపంచకప్లో మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ కలిసి భారత్ను కేవలం 79 పరుగులకే ఆలౌట్ చేశారు. స్పిన్ బౌలర్లను ఎదుర్కొంటూ పరుగులు చేయకుండా కేవలం బౌండరీలను సాధించే క్రమంలో అనవసరంగా రన్రేట్ పెరిగిపోయింది. దీంతో చివర్లో ఒత్తిడి పెరిగి వికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇది న్యూజిలాండ్పై భారత్ చేసిన రెండో తప్పు. ఈ పరిస్థతి ఇప్పుడు రిపీట్ కాకుండా ఉండాంటే.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ధైర్యంగా ఆడాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే.. సూర్యకుమార్, తిలక్ వర్మతో సహా భారత మిడిల్ ఆర్డర్ కుంగిపోకూడదు.
2023లో భారత్కు అహ్మదాబాద్ స్టేడియం కలసి రాలేదు. 2023 ODI ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఆధిపత్య భారత జట్టు ఓటమి పాలైంది. ఆ మ్యాచ్లో పిచ్ పరిస్థితులను సరిగా అంచనా వేయకపోవడం, అజేయ జట్టుగా భావించి కొంత నిర్లక్ష్యం చూపించడం వంటి అంశాలు భారత్కు చేదు అనుభవంగా మారాయి. ఇప్పుడు జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ పూర్తి నిబద్ధతతో ఉండాలి. ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా ముందుగానే అన్ని విషయాల్లో స్పష్టమైన ప్రణాళిక అవసరం. ఈ మూడు తప్పులను రిపీట్ చేయకపోతే.. ఈ సారి కప్పు మనదే అని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
India’s Most Powerful Women 2026: దేశంలో అత్యంత ప్రభావవంతమైన మహిళలు ఎవరు?.. ఏకంగా రూ.39 లక్షల కోట్ల ఆస్తులు!
-
Telangana Civil Supplies: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 31 వరకే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత.. 7000 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
ట్రెండింగ్
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!