రాజస్థాన్లోని ఓ ప్రముఖ శ్రీకృష్ణుడి ఆలయానికి భారీ స్థాయిలో విరాళాలు వచ్చాయి. ఆలయ అధికారులే షాక్ అయ్యేలా విరాళాలు రావడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆలయంలో రెండు నెలల తర్వాత అధికారులు హుండీ లెక్కింపు చేపట్టగా కిలో బంగారు బిస్కెట్లు, రూ.23 కోట్లకు పైగా నగదు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.