బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అందులోనూ బాలీవుడ్లో నెగ్గుకురావడం అంటే మామూలు విషయం కాదూ. యాక్టింగ్ స్కిల్తో పాటు కాస్తంత అదృష్టం ఉండాలి. ఆ కోవకే చెందుతాడు కార్తీక్ ఆర్యన్. పుష్కర కాలం క్రితం కెరీర్ స్టార్ట్ చేసినా తక్కువ టైంలోనే బాగా క్లిక్ అయ్యాడు. లవ్ అండ్ రొమాంటిక్, కామెడీ థ్రిల్లర్ చిత్రాలతో యూత్ ఆడియన్స్కు చేరువయ్యాడు. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన భూల్ భూలయ్యా3తో భారీ హిట్ అందుకుని స్టార్ హీరోగా ఛేంజ్ అయ్యాడు. అతడి కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది భూల్ భూలయ్యా3. దీంతో నెక్ట్స్ సినిమాల విషయంలో ఎక్స్ పర్టేషన్స్ మారిపోతున్నాయి.
Also Read : Coolie : సోషల్ మీడియాకు దూరంగా లోకేష్ కనగరాజ్.. కారణం ఏంటంటే.?
అనురాగ్ బసు దర్శకత్వంలో లవ్ స్టోరీ చేస్తున్నాడు కార్తీక్ ఆర్యన్. ఆషికీ 3 అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలీల ఈ మూవీతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ ప్రాజెక్టులో కలిసి నటించడంతోనే కార్తీక్ ఆర్యన్- శ్రీలీల మధ్య సంథింగ్ సంథింగ్ స్టార్టయ్యిందని బజ్. అలాగే బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ చేస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇప్పుడు కరణ్ జోహార్ ప్రొడక్షన్ హౌజ్లో మరోసారి నటించే ఛాన్స్ కొల్లగొట్టాడు సెల్ఫ్ మేడ్ హీరో. ధర్మ ప్రొడక్షన్ నిర్మిస్తున్న నాగ్జిల్లాలో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడు. రీసెంట్లీ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. పాముల మధ్య జస్ట్ బ్యాక్ సైడ్ ఆఫ్ కార్తీక్ ఆర్యన్ను చూపిస్తూ సినిమాపై క్యూరియస్ కలిగిస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్ మరియు మహావీర్ జైన్ ఫిలింస్ బ్యానర్లపై బొమ్మ తెరకెక్కుతోంది. ఫుక్రే ఫేం మృగ్ దీప్ సింగ్ లంబా దర్శకుడు. ఇందులో చాక్లెట్ బాయ్ నాగరాజుగా కనిపించనున్నాడన్నది టాక్. నెక్ట్స్ ఇయర్ ఆగస్టు 14న రిలీజ్ చేయబోతున్నట్లు ఎనౌన్స్ చేశారు మేకర్స్. ఏదైమైనా వారసులకు పెద్ద పీట వేసే ధర్మ ప్రొడక్షన్స్ నుండి హీరోగా సెకండ్ ఛాన్స్ అందుకున్నాడంటే కార్తీక్ రాబోయే రోజుల్లో స్టార్ హీరోగా మారడం ఖాయం.