Virat Kohli Anushka: లండన్లో ఉన్నా భారత్లో పెట్టుబడులు.. మరో లగ్జరీ ఇల్లు సొంతం చేసుకున్న విరాట్, అనుష్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Anushka: క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మరోసారి తమ రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో వార్తల్లో నిలిచారు. దేశంలోని ప్రీమియం ప్రాపర్టీలపై ఎప్పటి నుంచో ఆసక్తి చూపుతున్న ఈ సెలబ్రిటీ జంట తాజాగా ముంబైలో మరో ఖరీదైన లగ్జరీ అపార్ట్మెంట్ను కొనుగోలు చేసింది. గత కొంతకాలంగా లండన్లో ఎక్కువ సమయం గడుపుతున్నప్పటికీ, భారతదేశంలో పెట్టుబడుల విషయంలో మాత్రం ఎలాంటి వెనుకడుగు వేయడం లేదని ఈ తాజా డీల్ మరోసారి స్పష్టం చేసింది. ముంబైలోని ప్రముఖ ప్రాంతమైన వెర్సోవాలో 18.29 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్మెంట్ను విరాట్, అనుష్క కొనుగోలు చేశారు. సుమారు 2,644 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్ ఒక ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లో ఉంది. ఈ డీల్లో రెండు కార్ పార్కింగ్ స్లాట్లు కూడా ఉన్నాయి. ముంబైలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో వెర్సోవా ఒకటిగా ఉండటంతో ఈ పెట్టుబడి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇది ఈ జంట చేసిన తొలి రియల్ ఎస్టేట్ పెట్టుబడి కాదు. ఇప్పటికే వర్లీలో సముద్రానికి దగ్గరగా ఉన్న అత్యంత విలాసవంతమైన నివాసాన్ని వీరు కలిగి ఉన్నారు. అలాగే అలీబాగ్లో లగ్జరీ విల్లాను కూడా కొనుగోలు చేశారు. ఈ రెండింటితో పాటు ఇతర ఆస్తులను కూడా కలుపుకుంటే, విరాట్, అనుష్కల రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో విలువ భారీ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఈ జంట తమ పిల్లలతో కలిసి లండన్లో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ, భారతదేశంలోని ప్రీమియం రియల్ ఎస్టేట్ మార్కెట్పై వారి నమ్మకం ఏమాత్రం తగ్గలేదని తాజా కొనుగోలు సూచిస్తోంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో విరాట్ కోహ్లీ ఎప్పటినుంచో ఆసక్తి చూపుతుండగా, అనుష్క శర్మ కూడా సినిమా ప్రాజెక్టులను తగ్గించిన తర్వాత ఆర్థిక నిర్ణయాలను ఎంతో జాగ్రత్తగా తీసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read
- Anaswara : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న యంగ్ హీరోయిన్
- Anasuya Bharadwaj: మరో వివాదంలో నటి అనసూయ.. ‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలపై కేసు నమోదు ..
- NC25 : వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని హీరో మైల్స్టోన్ మూవీ?
- NBKxKoratalaSiva : పుకార్లు సృష్టిస్తే దబిడి దిబిడే.. బాలయ్య - కొరటాల శివ సినిమాపై టీమ్ క్లారిటీ
ఇక వృత్తిపరంగా చూస్తే, విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికినా, వన్డేలు, టీ20లు, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు, అనుష్క శర్మ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అయినప్పటికీ, పెట్టుబడుల విషయంలో మాత్రం ఈ జంట చురుకుగా వ్యవహరిస్తూ తమ ఆస్తులను మాత్రం మరింత పోగేసుకుంటోంది.
తాజావార్తలు
-
Votes Cancelled: రాజధానిలో 43 లక్షల ఓట్లు గల్లంతు.. మీ ఓటు ఉందా..? లేదా..? తెలుసుకోండిలా..
-
Anaswara : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న యంగ్ హీరోయిన్
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?
-
Anasuya Bharadwaj: మరో వివాదంలో నటి అనసూయ.. ‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలపై కేసు నమోదు ..
ట్రెండింగ్
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!