Virat Kohli Anushka: లండన్లో ఉన్నా భారత్లో పెట్టుబడులు.. మరో లగ్జరీ ఇల్లు సొంతం చేసుకున్న విరాట్, అనుష్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Anushka: క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మరోసారి తమ రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో వార్తల్లో నిలిచారు. దేశంలోని ప్రీమియం ప్రాపర్టీలపై ఎప్పటి నుంచో ఆసక్తి చూపుతున్న ఈ సెలబ్రిటీ జంట తాజాగా ముంబైలో మరో ఖరీదైన లగ్జరీ అపార్ట్మెంట్ను కొనుగోలు చేసింది. గత కొంతకాలంగా లండన్లో ఎక్కువ సమయం గడుపుతున్నప్పటికీ, భారతదేశంలో పెట్టుబడుల విషయంలో మాత్రం ఎలాంటి వెనుకడుగు వేయడం లేదని ఈ తాజా డీల్ మరోసారి స్పష్టం చేసింది. ముంబైలోని ప్రముఖ ప్రాంతమైన వెర్సోవాలో 18.29 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్మెంట్ను విరాట్, అనుష్క కొనుగోలు చేశారు. సుమారు 2,644 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్ ఒక ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లో ఉంది. ఈ డీల్లో రెండు కార్ పార్కింగ్ స్లాట్లు కూడా ఉన్నాయి. ముంబైలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో వెర్సోవా ఒకటిగా ఉండటంతో ఈ పెట్టుబడి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇది ఈ జంట చేసిన తొలి రియల్ ఎస్టేట్ పెట్టుబడి కాదు. ఇప్పటికే వర్లీలో సముద్రానికి దగ్గరగా ఉన్న అత్యంత విలాసవంతమైన నివాసాన్ని వీరు కలిగి ఉన్నారు. అలాగే అలీబాగ్లో లగ్జరీ విల్లాను కూడా కొనుగోలు చేశారు. ఈ రెండింటితో పాటు ఇతర ఆస్తులను కూడా కలుపుకుంటే, విరాట్, అనుష్కల రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో విలువ భారీ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఈ జంట తమ పిల్లలతో కలిసి లండన్లో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ, భారతదేశంలోని ప్రీమియం రియల్ ఎస్టేట్ మార్కెట్పై వారి నమ్మకం ఏమాత్రం తగ్గలేదని తాజా కొనుగోలు సూచిస్తోంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో విరాట్ కోహ్లీ ఎప్పటినుంచో ఆసక్తి చూపుతుండగా, అనుష్క శర్మ కూడా సినిమా ప్రాజెక్టులను తగ్గించిన తర్వాత ఆర్థిక నిర్ణయాలను ఎంతో జాగ్రత్తగా తీసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read
- Pavala Shyamala: టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత..!
- Vadhandhi 2: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్కు సీక్వెల్.. 'వధండి 2' స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, ఈసారి హీరో మారిపోయాడు!
- Anna Konidela: ఇకపై అన్నా లెజినోవా కాదు.. నన్ను ఇలా పిలవండి అంటూ పవన్ భార్య స్పెషల్ రిక్వెస్ట్!
- Multi Heroine Trend: పాన్ ఇండియా సినిమాల్లో కొత్త ట్రెండ్.. ఒక హీరోకు ఐదుగురు హీరోయిన్లు?
ఇక వృత్తిపరంగా చూస్తే, విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికినా, వన్డేలు, టీ20లు, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు, అనుష్క శర్మ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అయినప్పటికీ, పెట్టుబడుల విషయంలో మాత్రం ఈ జంట చురుకుగా వ్యవహరిస్తూ తమ ఆస్తులను మాత్రం మరింత పోగేసుకుంటోంది.
తాజావార్తలు
-
Virat Kohli Anushka: లండన్లో ఉన్నా భారత్లో పెట్టుబడులు.. మరో లగ్జరీ ఇల్లు సొంతం చేసుకున్న విరాట్, అనుష్క
-
Justin Greaves: టెస్ట్ చరిత్రలో అరుదైన రికార్డు.. ఒక్క పరుగు ఇవ్వకుండా 5 వికెట్లు నేలకూల్చిన వెస్టిండీస్ పేసర్.!
-
Sharmila Dhankhar: పోలియోను జయించి చరిత్ర సృష్టించిన షర్మిలా ధన్ఖర్.. పారా షాట్పుట్లో స్వర్ణం
-
Pavala Shyamala: టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత..!
-
Abqaiq Refinery Fire: ఇరాక్ డ్రోన్ దాడులు.. సౌదీ అరేబియాలోని అబ్కైక్ ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!