Varisu: ముదురుతున్న ‘వారిసు’ వివాదం… తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కలిసి చేస్తున్న సినిమా ‘వారిసు’. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగులో ‘వారసుడు’గా రిలీజ్ అవుతోంది. రష్మిక హీరోయిన్ గా నటించిన ‘వారిసు’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నానని దిల్ రాజు ఏ టైంలో చెప్పాడో కానీ అప్పటినుంచి ఇండస్ట్రీలో రచ్చ జరుగుతూనే ఉంది. సంక్రాంతి, దసరా లాంటి సీజన్స్ లో తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగు సినిమాలకి ఎక్కువ థియేటర్స్ ఇచ్చిన తర్వాతే డబ్బింగ్ సినిమాలకి థియేటర్స్ కేటాయించాలి అని నిర్మాతల మండలి చెప్పడంతో ‘వారిసు’ వివాదం మొదలయ్యింది. సంక్రాంతి సీజన్ లోనే చిరు నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మన స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమాలని కాదని డబ్బింగ్ సినిమా అయిన ‘వారసుడు’కి దిల్ రాజు ఎక్కువ థియేటర్స్ ఎలా కేటాయిస్తాడు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దిల్ రాజు మాత్రం ఈ కామెంట్స్ పట్టించుకోకుండా, ‘వారిసు’ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నాడు.
‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ కి లేనిది వేరే వాళ్లకి ఎందుకు అనేది దిల్ రాజు వర్షన్. డిస్ట్రిబ్యూటర్స్ తో తనకి ఉన్న రిలేషన్ కారణంగా ‘వారసుడు’ సినిమాకే మంచి థియేటర్స్ వస్తాయనేది దిల్ రాజు మాట. అయితే సంక్రాంతి సీజన్ దగ్గర పడే కొద్దీ ఈ థియేటర్స్ గొడవ పెరుగుతూనే ఉంది. ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్ ఇస్తారు అనే డిస్కషన్ ఇండస్ట్రీతో పాటు కామన్ ఆడియన్స్ లో కూడా మొదలయ్యింది. ఇలాంటి వేడి వేడి వాతావరణంలో ‘వైజాగ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషణ్ అసోషియేషన్’ ఎగ్జిబిటర్స్ ని ఉద్దేశిస్తూ ఒక లెటర్ రిలీజ్ చేసింది. సంక్రాంతి, దసరా సీజన్స్ లో తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ థియేటర్స్ కేటాయించాలని ‘వైజాగ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషణ్ అసోషియేషన్’ ఎగ్జిబిటర్స్ ని కోరారు. దీంతో ‘వారసుడు’ థియేటర్స్ గొడవ మరోసారి చర్చనీయాంశం అయ్యింది.
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: 'స్పెషల్ థియేటర్స్' కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
‘వైజాగ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషణ్ అసోషియేషన్’ లెటర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇది చూసిన తమిళులు, మా హీరో సినిమాకి అన్యాయం జరిగితే తమిళనాడులో తెలుగు సినిమాలకి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ వివాదం ముదిరి తెలుగు తమిళ చిత్ర పరిశ్రమల మధ్య గ్యాప్ పెరిగే లోపు, సినీ పెద్దలు కూర్చోని ఈ ఇష్యూని పరిష్కరించడం మంచింది. మరి సంక్రాంతికి ఇంకా నెల రోజులు సమయం మాత్రమే ఉంది కాబట్టి ఈలోపు దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ కూర్చోని మాట్లాడుకోని థియేటర్స్ ఇష్యూని సాల్వ్ చేస్తారేమో చూడాలి.
తాజావార్తలు
-
Road Accident: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లో నలుగురి మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!