ఒక్క హిట్.. ఒకే ఒక్క హిటే కోసం నాలుగేళ్లుగా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు మ్యాచో స్టార్ గోపీచంద్. సీటీమార్ తర్వాత బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో చూడలేదు. ఆరడుగుల బుల్లెట్ నుండి రీసెంట్లీ వచ్చిన విశ్వం వరకు వరుసగా ఐదు డిజాస్టర్లను చూశాడు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని గ్రిప్పింగ్ స్టోరీలపై ఫోకస్ చేశాడు. మొత్తానికి తీసుకున్న గ్యాప్ సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫ్యాన్స్కు ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు గోపీ.
Also Read : SubhamTrailer : సమంత నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘శుభం’ ట్రైలర్ రిలీజ్
ఘాజీతో తనలోని టాలెంట్ ఫ్రూవ్ చేసుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ 33 మార్చిలోనే స్టార్టైంది. ఇందులో సరికొత్త గోపీని చూపించబోతున్నాడట సంకల్ప్ రెడ్డి. పీరియాడిక్ మూవీగా రాబోతుందని తెలుస్తోంది. 7వ శతాబ్దం నాటి సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్నాడు సంకల్స్ రెడ్డి. ఇప్పుడు రీసెంట్లీ కొత్త దర్శకుడు కుమార్ సాయిని వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు ఈ ఆరడుగుల బుల్లెట్. ఈ సినిమాతో మరో మలయాళ కుట్టీ మీనాక్షి దినేష్ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతోంది. గోపీచంద్ తన నెక్ట్స్ సినిమాల విషయంలో కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చాడు కానీ నిర్మాతలను మాత్రం రిపీట్ చేస్తున్నాడు. సీటీమార్ తర్వాత శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్లో మూవీని ఎనౌన్స్ చేశాడు. దీనికే సంకల్ప్ రెడ్డి దర్శకుడు. అలాగే రీసెంట్లీ లాంచైన వెంచర్ను ఎస్వీసీసీ బ్యానర్ తెరకెక్కిస్తోంది. గతంలో ఇదే బ్యానర్పై సాహసం చేశాడు మ్యాచో స్టార్. కలెక్షన్స్ ఎలా ఉన్నా గోపీ కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఇంచు మించు పన్నేండేళ్ల తర్వాత హీరో- బ్యానర్ జోడీ రిపీట్ అవుతోంది. తెలుగులో విరూపాక్ష తర్వాత హిట్ చూడని ప్రొడక్షన్ హౌస్ గోపీచంద్ మూవీతో కంబ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తోంది. ప్లాపుల్లో ఉన్న మ్యాచో స్టార్ కూడా సాలిడ్ హిట్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు. తనను నమ్మి వచ్చిన నిర్మాతలకు ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూడాలి.