TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో సర్వత్రా ఆసక్తి రేకెత్తించిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పోలింగ్ అనంతరం చేపట్టిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో ఎన్నికల అధికారులు విజేతల జాబితాను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో సీ. కళ్యాణ్ నేతృత్వంలోని ప్యానెల్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించి అఖండ విజయాన్ని నమోదు చేసింది. నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత సీ. కళ్యాణ్ ముందే ఏకగ్రీవంగా ఎన్నికవడంతో మిగిలిన కీలక కార్యవర్గ పదవులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. కౌంటింగ్ పూర్తయ్యేసరికి ప్రధాన పోస్టులన్నింటినీ కళ్యాణ్ ప్యానెల్ అభ్యర్థులే భారీ ఆధిక్యంతో కైవసం చేసుకున్నారు.
ఉపాధ్యక్ష (వైస్ ప్రెసిడెంట్) పదవులకు జరిగిన పోరులో అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు. అత్యధికంగా 338 ఓట్లు సాధించి మోహన్ వడ్లపట్ల మొదటి స్థానంలో నిలవగా, 274 ఓట్లతో ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ (దాము) రెండో స్థానాన్ని దక్కించుకుని ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కోశాధికారి (ట్రెజరర్) స్థానానికి జరిగిన పోటీలో చదలవాడ శ్రీనివాసరావు ఏకపక్ష విజయం సాధించారు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకంగా 383 ఓట్లు కొల్లగొట్టి తన పట్టును చాటుకున్నారు. జాయింట్ సెక్రటరీ స్థానాల్లో కూడా భారీ ఓట్ల మెజారిటీ కనిపించింది. అమ్మిరాజు కానుమిల్లి 416 ఓట్లతో ప్రథమ స్థానంలో నిలవగా, తుమ్మలపల్లి రామసత్యనారాయణ 398 ఓట్లు దక్కించుకుని జాయింట్ సెక్రటరీలుగా బాధ్యతలు చేపట్టనున్నారు.
Also Read
- Mahatma Gandhi: గాంధీగా మారిన మనోజ్ బాజ్పేయి.. ఆ 21 రోజుల కథతో వస్తున్న కొత్త సినిమా!
- Shruti Haasan: AI ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్.. శృతి హాసన్కు భారీ ఊరట!
- Anta Ramuloru Chooskuntaru: సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ జోడీకి క్రేజీ టైటిల్.. 'అంతా రాములోరు చూస్కుంటారు' అంటూ గ్లింబ్స్ తో సర్ప్రైజ్!
- Producer Council Elections: ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో సందడి.. ఓటేసిన అగ్ర నిర్మాతలు, యువ హీరోలు!
మొత్తం 15 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సభ్యుల ఎన్నికలో పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు భారీ మద్దతును కూడగట్టుకున్నారు. ఈసీ రేసులో పద్మిని నాగులపల్లి అత్యధికంగా 426 ఓట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. మైత్రి మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్ యలమంచిలి (మైత్రి రవి) 412 ఓట్లతోను, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్-నిర్మాత సునీల్ నారంగ్ 411 ఓట్లతోను తమ బలాన్ని నిరూపించుకున్నారు. జేవీ మోహన్ గౌడ్ (404), శివలెంక కృష్ణప్రసాద్ (397), అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య (360) కూడా స్పష్టమైన మెజారిటీతో ఈసీ సభ్యులుగా గెలుపొందారు. వీరితో పాటు వంశీ నందిపాటి (355), పల్లి కేశవరావు (345), డీఎస్ రావు (337), వజ్జ శ్రీనివాసరావు (329), జే. పుల్లారావు (325), బాపిరాజు బల్లిపాడు (324), పి. రామకృష్ణాగౌడ్ (304), ఎస్కే నయీమ్ అహ్మద్ (285), కే. నిరంజన్ రెడ్డి (281) ఈసీ సభ్యులుగా ఎన్నికై విజేతల జాబితాలో నిలిచారు.
తాజావార్తలు
-
TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
-
Fire Accident: ఆటోనగర్లోని హ్యుందాయ్ కార్ల షోరూమ్లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..
-
Vikarabad Land Fraud : 2 ఎకరాలు రాసిస్తే.. మొత్తం భూమినే కొట్టేశాడు.. అల్లుడి మాస్టర్ ప్లాన్
-
PM Modi: ‘‘హోమియోపతి ఇచ్చా, దిమాగీ నక్సల్స్ బయటకు వస్తున్నారు’’.. మోడీ సంచలన వ్యాఖ్యలు..
-
BJP: రాజమండ్రిలో బీజేపీ నేతల వ్యాఖ్యలు.. మోదీ ప్రజాసేవ ఉత్సవాలకు సన్నాహాలు..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!