Vikarabad Land Fraud : 2 ఎకరాలు రాసిస్తే.. మొత్తం భూమినే కొట్టేశాడు.. అల్లుడి మాస్టర్ ప్లాన్
- కూతురిపై నమ్మకంతో భూమి రాసిచ్చిన అత్త
- అధికారులతో కుమ్మక్కై అల్లుడి మోసం
- మొత్తం భూమి తన పేరుపై రిజిస్ట్రేషన్
- పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikarabad Land Fraud : కంటికి రెప్పలా పెంచుకున్న కూతురిపై నమ్మకంతో భూమి రాసిస్తే, అల్లుడు దారుణమైన మోసానికి ఒడిగట్టాడు. అత్త నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, అధికారుల అండతో భూమి మొత్తాన్ని తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంఘటన వికారాబాద్ జిల్లాలో కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన చెంద్రమ్మకు 4 ఎకరాల 27 గుంటల భూమి ఉంది. ఆమెకు ఒక కూతురు లక్ష్మి, ఒక పెంపుడు కొడుకు ఉన్నారు. తన బాధ్యతలన్నీ చూసుకుంటుందనే నమ్మకంతో ఉన్న ఒక్క కూతురు లక్ష్మికి 2 ఎకరాల 6 గుంటల భూమిని ఇవ్వాలని, పెంపుడు కొడుకుకు ఎకరంన్నర భూమిని ఇవ్వాలని చెంద్రమ్మ నిర్ణయించుకుంది. కాగా, అదే గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి లక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డ్రామా
కూతురి పేరిట 2 ఎకరాల 6 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి చెంద్రమ్మ పరిగి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చింది. అయితే, అల్లుడు మల్లేష్ రెవెన్యూ అధికారులు , కంప్యూటర్ ఆపరేటర్తో కుమ్మక్కై పెద్ద డ్రామాకే తెరలేపాడు. రిజిస్ట్రేషన్ సమయంలో చెంద్రమ్మ పదే పదే 2 ఎకరాల 6 గుంటలే కదా అని అడిగినప్పటికీ, ఆపరేటర్ అవుననే సమాధానమిచ్చాడు. కానీ, లోపల మాత్రం చెంద్రమ్మకు చెందిన మొత్తం 3 ఎకరాల 6 గుంటల భూమిని అల్లుడు తన పేరిట మార్చేసుకున్నాడు.
Also Read
- Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
- Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
- KCR: నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
- OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
బాధితురాలి ఆవేదన… పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
తీరా రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక తన పేరిట ఒక్క గుంట భూమి కూడా మిగలలేదని తెలుసుకున్న చెంద్రమ్మ తహసీల్దార్ కార్యాలయం వద్దే లబోదిబోమంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నమ్మి వస్తే అల్లుడే కొంపముంచాడని కన్నీరుమున్నీరైంది. అనంతరం గ్రామ పెద్దలతో కలిసి పరిగి పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మోసంపై తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేయడంతో, అధికారులు తదుపరి చర్యల్లో భాగంగా పాస్ పుస్తకాలు జారీ కాకుండా నిలిపివేశారని గ్రామస్థులు తెలిపారు.
తాజావార్తలు
-
Vikarabad Land Fraud : 2 ఎకరాలు రాసిస్తే.. మొత్తం భూమినే కొట్టేశాడు.. అల్లుడి మాస్టర్ ప్లాన్
-
PM Modi: ‘‘హోమియోపతి ఇచ్చా, దిమాగీ నక్సల్స్ బయటకు వస్తున్నారు’’.. మోడీ సంచలన వ్యాఖ్యలు..
-
BJP: రాజమండ్రిలో బీజేపీ నేతల వ్యాఖ్యలు.. మోదీ ప్రజాసేవ ఉత్సవాలకు సన్నాహాలు..
-
War: అంటుకుంటున్న నిప్పురవ్వలు.. మంటల్లో ప్రపంచం?
-
Iran: ఇరాన్లో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!