Telugu Indian Idol : బెస్ట్ సింగర్ గా వాగ్దేవికే పట్టం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ విజేత విషయంలో సస్పెన్స్ వీడిపోయింది. ఫైనల్ కంటెస్టెంట్స్ ఐదుగురితో జరిగిన గ్రాండ్ ఫినాలేలో విజేతగా నెల్లూరుకు చెందిన వాగ్దేవి విజేతగా నిలిచింది. ఈ ఫైనల్ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో శుక్రవారం రాత్రి ప్రసారం కానుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ గ్రాండ్ ఫినాలేకు ముఖ్యఅతిథిగా హాజరు కాగా, ‘విరాట పర్వం’ మూవీ జోడీ రానా, సాయి పల్లవి ఈ ప్రోగ్రామ్ లో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చారు. వాగ్దేవితో పాటు ఆమె అక్క వైష్ణవి సైతం ‘తెలుగు ఇండియన్ ఐడల్’కు హాజరైంది. అయితే మొదటి ఒడపోతలో కేవలం 12 మందిని ఎంపిక చేసినప్పుడు వైష్ణవి పోటీ నుండి నిష్క్రమించింది. ఆ తర్వాత ఒక్కొక్కరి చొప్పున ఎలిమినేట్ చేస్తూ, చివరకు గ్రాండ్ ఫినాలేకు ఐదుగురు కంటెస్టెంట్స్ ను మిగిల్చారు. అందులో మిగిలిన వారిని దాటుకుంటూ వాగ్దేవి విన్నర్ గా నిలవడం విశేషం.
మెగాస్టార్ చిరంజీవికి నెల్లూరుతో అనుబంధం ఉందని, ఆ ఊరికే చెందిన తన కూతురు ఆయన చేతుల మీదుగా తెలుగు ఇండియన్ ఐడల్ ట్రోఫీని అందుకోవడం ఆనందంగా ఉందని వాగ్దేవి తండ్రి చెప్పారు. చిన్నప్పటి నుండే తన సోదరి వైష్ణవితో పాటు వాగ్దేవి సంగీతం నేర్చుకుందని, అయితే కాస్తంత ఆలస్యంగా మ్యూజిక్ క్లాసెస్ కు హాజరైన తను, త్వరగా వాటిని అవగతం చేసుకునేదని కితాబిచ్చారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్స్ ఎన్ని జరిగినా, తొలి విజేతగా తన కూతురు నిలవడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. సింగర్ గా చూడాలన్నది తన తల్లి కోరికని, ఈ కార్యక్రమంలో పాల్గొనడంలో ఆమె ప్రోత్సాహం ఎంతో ఉందని, అందుకే ఈ ట్రోఫీ అమ్మకే అంకితమని వాగ్దేవి చెప్పింది. ‘ఆహా’లో తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమం వస్తున్న సమయంలో ఎంతో మంది సినీ ప్రముఖులు తనకు ప్రోత్సాహాన్ని అందించారని వాగ్దేవి తెలిపింది.
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇళయరాజా, రెహమాన్ ఇష్టం!
ఓ గాయనిగా ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వంలో పాడాలన్నది తన కల అని వాగ్దేవి చెప్పింది. అలానే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో కోరస్ పాడినా అదృష్టంగా భావిస్తానని తెలిపింది. ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రేక్షకులు తన పాటతో కనెక్ట్ అయ్యారని, వారు అభిమానంతో ఓటు వేసినందునే తాను గెలిచానని వాగ్దేవి చెప్పింది. అలా ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడమనేది అదృష్టమని, అది తనకు దేవుడిచ్చిన వరంగా భావిస్తానని తెలిపింది. చదువును పూర్తి చేసి, సింగర్ గా స్థిరపడాలన్నది తన కోరిక అని చెప్పింది.. విశేషం ఏమంటే… కేవలం సింగర్ గానే కాకుండా నటిగానూ కొన్ని చిత్రాలలో అవకాశాలు వాగ్దేవిని పలకరిస్తున్నాయని తెలుస్తోంది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!