Bandi Sanjay: ఎంతమంది చచ్చినా.. కేసీఆర్, కేటీఆర్ స్పందించరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Fires On CM KCR And KTR: సికింద్రాబాద్లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న స్వప్నలోక్ కాంప్లెక్స్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై ధ్వజమెత్తారు. ఇంత పెద్ద అగ్ని్ప్రమాదం జరిగి, ఎంతమంది చనిపోతున్నా.. మున్సిపల్ మంత్రి గానీ, ముఖ్యమంత్రి గానీ రాకపోవడం దారుణమన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటోందే తప్ప.. గతంలో జరిగిన, ఇప్పుడు జరిగిన అగ్నిప్రమాదాలపై కనీసం సమీక్ష కూడా చేయడం లేదని మండిపడ్డారు. సచ్చినోళ్ళకు సంతాపం.. బతికి ఉన్నోళ్లకు పరిహారం అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీరు అని అన్నారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు పొట్టి కూటి కోసం నగరానికి వచ్చి, ప్రాణాలు పోగొట్టుకోవడం బాధ కలిగించిందన్నారు. మృతుల కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర మంత్రివర్గమంతా లిక్కర్ కేసులో ఇరుక్కున్న కవిత కోసం వెళ్లింది కానీ, ఈ ఘటనపై స్పందించరని మండిపడ్డారు. ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరిపి, మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Bhatti Vikramarka: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
ఇదే సమయంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై బండి సంజయ్ మరోసారి స్పందించారు. ఈ కేసులో నిందితురాలైన రేణుక ఒక బీఆర్ఎస్ నేత కూతురని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం లీకేజ్ అవ్వగా.. బీజేపీని బద్నాం చేయాలని చూశారన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగి గురించి ఆరా తీయకుండానే.. ఎంక్వైరీ చేయకుండానే.. టీఎస్పీఎస్సీలో ఉద్యోగం ఇచ్చారా? అని ప్రశ్నించారు. నిరుద్యోగుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆటలు ఆడుతోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. బీఆర్ఎస్ చెంప ఛెళ్లుమనిపించాయని అన్నారు. ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. కేవలం ఈ ఎన్నికల్లో కావు.. అసెంబ్లీ, పార్లమెంట్, ఇంకా ఏ ఎన్నికలొచ్చినా.. తెలంగాణలో బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
NTR30: ఎన్టీఆర్ 30 పూజకు గెస్ట్ గా చిరు.. నిజమైతే ఎంత బావుండు
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!