Bandi Sanjay: ఎంతమంది చచ్చినా.. కేసీఆర్, కేటీఆర్ స్పందించరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Fires On CM KCR And KTR: సికింద్రాబాద్లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న స్వప్నలోక్ కాంప్లెక్స్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై ధ్వజమెత్తారు. ఇంత పెద్ద అగ్ని్ప్రమాదం జరిగి, ఎంతమంది చనిపోతున్నా.. మున్సిపల్ మంత్రి గానీ, ముఖ్యమంత్రి గానీ రాకపోవడం దారుణమన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటోందే తప్ప.. గతంలో జరిగిన, ఇప్పుడు జరిగిన అగ్నిప్రమాదాలపై కనీసం సమీక్ష కూడా చేయడం లేదని మండిపడ్డారు. సచ్చినోళ్ళకు సంతాపం.. బతికి ఉన్నోళ్లకు పరిహారం అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీరు అని అన్నారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు పొట్టి కూటి కోసం నగరానికి వచ్చి, ప్రాణాలు పోగొట్టుకోవడం బాధ కలిగించిందన్నారు. మృతుల కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర మంత్రివర్గమంతా లిక్కర్ కేసులో ఇరుక్కున్న కవిత కోసం వెళ్లింది కానీ, ఈ ఘటనపై స్పందించరని మండిపడ్డారు. ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరిపి, మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Bhatti Vikramarka: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్
Also Read
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
ఇదే సమయంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై బండి సంజయ్ మరోసారి స్పందించారు. ఈ కేసులో నిందితురాలైన రేణుక ఒక బీఆర్ఎస్ నేత కూతురని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం లీకేజ్ అవ్వగా.. బీజేపీని బద్నాం చేయాలని చూశారన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగి గురించి ఆరా తీయకుండానే.. ఎంక్వైరీ చేయకుండానే.. టీఎస్పీఎస్సీలో ఉద్యోగం ఇచ్చారా? అని ప్రశ్నించారు. నిరుద్యోగుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆటలు ఆడుతోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. బీఆర్ఎస్ చెంప ఛెళ్లుమనిపించాయని అన్నారు. ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. కేవలం ఈ ఎన్నికల్లో కావు.. అసెంబ్లీ, పార్లమెంట్, ఇంకా ఏ ఎన్నికలొచ్చినా.. తెలంగాణలో బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
NTR30: ఎన్టీఆర్ 30 పూజకు గెస్ట్ గా చిరు.. నిజమైతే ఎంత బావుండు
తాజావార్తలు
-
Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
-
Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
-
Mega brothers at Mega158 Launch: ఒకే ఫ్రేమ్లో మెగా బ్రదర్స్ .. చిరు – బాబి మూవీ ఓపెనింగ్లో ‘మెగా’ హ్యాపీనెస్
-
Ajinkya Rahane: “మా విజయ రహస్యం ఇదే”.. కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన కెప్టెన్ రహానే
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!