విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 27 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఇక తాజాగా ఈ సినిమా ప్రియ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికలో గ్రాండ్ గా జరుగుతోంది. ఇక ఈ వేదికపై నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ “తెలుగు సినిమా మూవీ మొఘల్ మా డాడీ రామానాయుడు గారు ఉండేవారు.. వారి తరువాత మనస్ఫూర్తిగా నేను మూవీ మొఘల్ అని పిలవగలిగేది నా సోదరుడు దిల్ రాజునే.. నిజమైన ఈ సినిమా నిర్మాత శిరీష్ ఒక మంచి మనిషి.. నాకు నిండుగా నచ్చినటువంటి మనిషి.
ఇక ఎఫ్ 3 మూవీ గురించి మాట్లాడాలంటే .. ఈరోజు మనం ఉన్న పరిస్థితికి 100% అవసరమైన సినిమా ఎఫ్3. సమాజంలో బయట టెంపరేచర్ ప్రకారం వేడి, సమస్యల ప్రకారం వేడి.. భయంకరమైన వేడిలో ఉన్న తెలుగు రాష్ట్రాలకు చాలా అత్యవసరమైనటువంటి నవ్వులను పంచే సినిమా ఇది. 100% అది చెప్పడానికి అర్హత ఉన్న వ్యక్తిని నేను.. కారణం నవ్వు. నవ్వు గురించి సమాజంలో ఒక మనిషి బ్రతుకులో నవ్వు ఎంత అవసరముంది అని చెప్పే సినిమాలో ఇదొక సినిమా.ఈ సమ్మర్ లో, ఈ సమాజంలో మీరందరు ఎదురుచూస్తున్నటువంటి 100% అవసరమున్న నిజమైన సినిమా.. అందరికి సమస్యలున్నాయి.. సీఎం దగ్గరనుంచి కామన్ మ్యాన్ వరకు.. అయితే ఆ సమస్యలన్నింటికి పరిష్కారం నవ్వు. 45 సంవత్సరాల నుంచి ఎన్ను నవ్వింది నవ్వు.. ఆ నవ్వు ఈరోజుకు కూడా మేము అందరం కలిసి మీకు ఇవ్వబోతున్నాం” అని చెప్పుకొచ్చారు.