SKN : ఎస్కేఎన్ చెప్పిన ఆ నెగటివ్ నిర్మాత ఎవరు?
- రాజాసాబ్ ను తక్కువ చేసిన నిర్మాత
- బయటపెట్టిన ఎస్కేఎన్
- అలా అన్నాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SKN : ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్ట్ చేస్తున్న రాజా సాబ్ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఈ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఎస్కేఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా మొదలైనప్పుడు ఒక నిర్మాత నెగటివ్ ట్రెండ్ చేశాడని, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అదే నిర్మాత పాజిటివ్ ట్రెండ్ చేస్తాడని చెప్పాడు.
Read Also : Kannappa Vs Kubera : కన్నప్ప వర్సెస్ కుబేర.. ఏ ట్రైలర్ బాగుందంటే..?
Also Read
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
- G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
అయితే ఆ నెగటివ్ ట్రెండ్ చేసిన నిర్మాత ఎవరు అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. వాస్తవానికి ఈ సినిమా ముందు డివీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివీవీ దానయ్య నిర్మించాల్సి ఉంది. అనౌన్స్మెంట్ టైంలో ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తారని కూడా పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత మారుతీ చేసిన పక్కా కమర్షియల్ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో డివీవీ దానయ్య ఈ సినిమా చేయలేనని చేతులెత్తేశారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్లోకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఎంట్రీ ఇచ్చింది. అలా ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాగా ది రాజా సాబ్ రూపొందుతోంది. ఈ నేపథ్యంలోనే ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ నిర్మాత ఎవరు? ఒకవేళ డివీవీ దానయ్య ఏనా ? అనే చర్చ జరుగుతోంది. కానీ డివీవీ దానయ్య నెగటివ్ ట్రెండ్ చేయించిన దాఖలాలు అయితే అధికారికంగా లేవు కాబట్టి స్వయంగా ఆయనే చెబితే కానీ ఆ నిర్మాత ఎవరు అనేది చెప్పలేం.
తాజావార్తలు
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!