Prabhas: మొన్న మహేష్ చెప్పాడు.. ఇప్పుడు ప్రభాస్ వంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas:సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి సినీ రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తండ్రి మరణంతో కుదేలు అయిన మహేష్ బాబును సినీ ప్రముఖులు ఓదారుస్తున్నారు. ఇక ఉదయం నుంచి ఇండస్ట్రీ మొత్తం మహేష్ ఇంటివద్దే ఉంది. సీనియర్ హీరోలు, కుర్ర హీరోలు, కొత్త నటులు అందరూ కృష్ణ ఇంటికి చేరుకొని ఆయనను కడసారి చూస్తున్నారు. ఇక తాజాగా కృష్ణ భౌతిక కాయానికి ప్రభాస్ నివాళులు అర్పించాడు. కొద్దిసేపటి క్రితమే కృష్ణ ఇంటికి చేరుకున్న ప్రభాస్.. అశృనయనాలతో కృష్ణకు పూలు వేసి నివాళులు అర్పించాడు. అనంతరం మహేష్ ను హత్తుకొని ధైర్యం చెప్పాడు. వీరిద్దరూ కొద్దిసేపు ప్రైవేట్ గా మాట్లాడినట్లు తెలుస్తోంది.
ఇక ఇదే పరిస్థితిని గత రెండు నెలల క్రితం మహేష్ పొజిషన్ లో ప్రభాస్ ఉన్న విషయం తెల్సిందే. ప్రభాస్ పెదనాన్న, నటుడు కృష్ణంరాజు మృతి చెందిన రోజు మహేష్ కూడా ప్రభాస్ కు ఇలానే ధైర్యం చెప్పాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రభాస్, మహేష్ కూర్చొని మాట్లాడుకుంటున్న ఫోటోలను అభిమానులు షేర్ చేస్తూ ఇద్దరు కుటుంబ పెద్దలను పోగొట్టుకున్నారు.. ధైర్యంగా ఉండండి.. మీకు మేము అందరం ఉన్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!