Mansoor Ali Khan: చిరు, త్రిషపై పరువు నష్టం దావా కేసు.. మన్సూర్ అలీపై న్యాయమూర్తి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madras Highcourt slams actor Mansoor Ali Khan: మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో నటి త్రిషపై అవమానకరమైన కామెంట్స్ చేసిన వివాదాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ‘ లియో’లో నటి త్రిషతో సన్నిహిత సన్నివేశం లేకపోవడం పట్ల మన్సూర్ అలీ ఖాన్ నిరాశ వ్యక్తం చేశారు, అతను చేసిన వ్యాఖ్యలు త్రిషకు కోపం తెప్పించగా పలువురు సినీ నటీనటులు కూడా అతనిని తప్పు పడుతూ కామెంట్స్ చేశారు. అయితే ఈ వివాదం ముగిసేందుకు గాను మన్సూర్ అలీ ఖాన్ త్రిషకు క్షమాపణలు చెప్పాడు. అలా చెప్పినట్టే చెప్పి మళ్ళీ మన్సూర్ అలీ ఖాన్ తర్వాత త్రిషపై పరువు నష్టం కేసు వేసేందుకు కోర్టును ఆశ్రయించాడు. అంతేకాదు త్రిషకి మద్దతుగా నటుడి వ్యాఖ్యలను ఖండించినందుకు ఖుష్బు, చిరంజీవిలను కూడా తన ఫిర్యాదులో చేర్చాడు. ఈ ముగ్గురి నుండి పరిహారంగా ఇప్పించాలని డబ్బు కూడా కోరాడు.
Chiranjeevi: కేసీఆర్కు చిరంజీవి పరామర్శ.. చాలా సంతోషంగా అనిపించిందన్న చిరు!
Also Read
- The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
- Dhanush - Anirudh : ధనుష్ - అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
- AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
- Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే 'వృషకర్మ' సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
ఈ కేసు మద్రాసు ఈరోజు హైకోర్టులో విచారణకు వచ్చింది, కేసును విచారించిన న్యాయమూర్తి, మన్సూర్ అలీ ఖాన్ ఫిర్యాదుపై విరుచుకుపడ్డారు. పబ్లిక్ ఫోరమ్లో ప్రముఖ నటిపై మన్సూర్ అలీఖాన్ అవమానకరంగా వ్యాఖ్యానించడాన్ని న్యాయమూర్తి ఖండించారు, బహిరంగంగా ఎలా ప్రవర్తించాలో అతనికి తెలియాలని అన్నారు. అంతేకాదు ఈ ఫిర్యాదుకు విరుద్ధంగా, అసలు ఫిర్యాదును త్రిష దాఖలు చేయాలని న్యాయమూర్తి భావించారు. ఈ నటుడు తరచూ వివాదాల్లో చిక్కుకుంటాడని న్యాయమూర్తి విమర్శించారు. నిర్దోషి అని పేర్కొన్నందుకు నటుడి మీద ఫైర్ అయ్యారు. మన్సూర్ అలీ ఖాన్ న్యాయవాది యూట్యూబ్ ఇంటర్వ్యూ అన్కట్ వీడియోను సమర్పించడానికి అంగీకరించారు, ఇక అంతేకాక నటుడిని ఖండిస్తూ త్రిష చేసిన పోస్ట్ను తొలగించమని ఆదేశించాలని డిమాండ్ చేశారు. దీంతో న్యాయమూర్తి త్రిష, ఖుష్బు, చిరంజీవిలను తమ పక్షాన వాదనలు వినిపించాల్సిందిగా కోరుతూ, కేసును డిసెంబర్ 22కి వాయిదా వేశారు. అంతేకాక తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్న మన్సూర్ అలీఖాన్ బేషరతుగా క్షమాపణ ఎందుకు చెప్పారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇక త్రిష తరఫు న్యాయవాది బాధితురాలే మౌనంగా ఉంటే త్రిష మీదనే ఎందుకు కేసు పెడుతున్నారని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!