Kadambari Kiran Birthday Special : శభాష్ కాదంబరి కిరణ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెరపై ఎక్కువగా కితకితలు పెట్టే పాత్రల్లోనే కనిపించారు కాదంబరి కిరణ్. కానీ, నిజజీవితంలో కన్నీరు పెట్టుకొనే వారిని ఆదుకోవడంలో ఇదిగో నేనున్నానంటూ ముందడుగు వేస్తూ ఉంటారు కిరణ్. తాను ఏర్పాటు చేసిన ‘మనం సైతం’ సంస్థ ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపారు కాదంబరి. అందుకే నేడు నటునిగా కన్నా మిన్నగా ఓ మానవతామూర్తిగా జేజేలు అందుకుంటున్నారు కిరణ్.
కాదంబరి కిరణ్ కాకినాడలో జన్మించారు. 1973లో మేనమామల దగ్గర చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చారు. చదువులో ఎంతో చురుకైన వారు. హైదరాబాద్ శ్రీరామచంద్ర కాలేజ్ లో బి.కామ్ చదివారు కిరణ్. చిన్నతనం నుంచీ సినిమా ఆయనను ఆకర్షించింది. దాంతో తొలుత నాటకాల్లో నటించారు. సినిమా రంగంలో ప్రవేశించాలన్న ఉద్దేశంతో పలు ప్రయత్నాలు చేశారు. తరువాత ‘సితార’ సినిమా వారపత్రికలో కొంతకాలం విలేకరిగా పనిచేశారు.
Also Read
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్ఫుత్ క్యారెక్టర్పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
ఆ సమయంలోనే కిరణ్ నటనాభిలాషను తెలుసుకున్న కొందరు దర్శకులు అవకాశాలు కల్పించారు. రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం ‘శివ’లో ఓ చిన్న పాత్రలో కనిపించిన కాదంబరి కిరణ్ తరువాత జంధ్యాల తెరకెక్కించిన ‘ప్రేమా… జిందాబాద్’లో నటించారు. ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ‘మనీ’లోనూ కాదంబరి కనిపించారు. అలా చేజిక్కిన పాత్రల్లో రాణిస్తూ వచ్చారు. ‘కుర్రాళ్ళ రాజ్యం’తో మెగాఫోన్ పట్టి డైరెక్టర్ అయ్యారు కాదంబరి. తరువాత టీవీ రంగంలో అడుగు పెట్టి పలు సీరియల్స్ లో నటించారు, నిర్మించారు, దర్శకత్వమూ వహించారు.
సినిమాల్లో అవకాశాలు వస్తే మాత్రం తప్పకుండా నటించేసేవారు కిరణ్. “అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, అల్లరి రాముడు, దేశముదురు, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు” వంటి చిత్రాలలో గుర్తింపు ఉన్న పాత్రలు పోషించారాయన. కాదంబరి కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ‘మట్టి మనిషి’ టీవీ సీరియల్ లో మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించడం విశేషం! సినిమా రంగం రంగుల ప్రపంచమే కానీ, అందులోని చీకటి కోణాలు ఎవరికీ తెలియవు. అలా చీకట్లో మగ్గుతూ బాధ పడేవారికి చేతనైన సాయం అందించేవారు కిరణ్. తరువాత స్నేహితుల సహకారంతో ‘మనం సైతం’ సంస్థను నెలకొల్పి ఎందరికో సాయం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో చిత్రపురి కాలనీలోని సినీ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకున్నారు. సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్స్ ను అందుబాటులో ఉంచి పలువురి ప్రాణాలను నిలిపారు. ప్రస్తుతం చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీకి ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్న కాదంబరి కిరణ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!