60 Years Of Eedu Jodu: అరవై ఏళ్ళ ‘ఈడూ-జోడూ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో కళావాచస్పతి జగ్గయ్య హీరోగా రాణించారంటే అందుకు దర్శకనిర్మాత కె.బి.తిలక్ ప్రధానకారకులని చెప్పకతప్పదు. తిలక్ తమ ‘అనుపమ ఫిలిమ్స్’ పతాకంపై తెరకెక్కించిన అనేక చిత్రాలలో జగ్గయ్యనే కథానాయకునిగా ఎంచుకున్నారు. అలా వారి కాంబోలో తెరకెక్కిన ‘ఈడూ-జోడూ’ చిత్రం అప్పట్లో జనాదరణ పొందింది. 1963 మే 17న ‘ఈడూ-జోడూ’ విడుదలై విజయం సాధించింది.
Read Also: Girl’s mind: అమ్మాయిల విషయంలో పురుషులు చేసే తప్పు ఏంటో తెలుసా?
Also Read
- Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
- Pradeep Ranganathan: ఆ డైరెక్టర్'తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
- Rao Bahadur: "మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!" రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
- Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
ఇంతకూ ‘ఈడూ-జోడూ’ కథ ఏమిటంటే – సుందరమ్మ తన కొడుకు డాక్టర్ వేణుతో కలసి పట్నం నుండి పల్లెకు వస్తుంది. అక్కడ ఆమె చిన్ననాటి స్నేహితురాలు కూతురు శాంత ఉంటుంది. వేణు, శాంత చిన్నప్పుడు కలసి ఆడుకొని ఉంటారు. సుందరమ్మ, శాంతను తన కోడలు చేసుకుంటానని చిన్నప్పుడు చెప్పి ఉంటుంది. కానీ, ఆమె కొడుకు డాక్టర్ కాగానే, వేరే సంబంధం చూడాలని ఆశిస్తుంది. రంగమ్మ తన కూతురును వేణుకు ఇవ్వాలని చూస్తుంది. కానీ ఆ అమ్మాయి, తన బావను ప్రేమించి ఉంటుంది. శాంత తల్లి చనిపోవడంతో ఒక్కతవుతుంది. ఆమెను ఆ ఊరిలో పేరు మోసిన షావుకారు లక్ష్మీపతికి ఈడూజోడూ కాకున్నా ఇచ్చి పెళ్ళి చేస్తారు. కానీ, తాగిన మైకంలో ఉన్న లక్ష్మీపతికి తరువాత నిజం తెలుస్తుంది. అతను ఊరిలో ఆసుపత్రి కట్టిస్తాడు. అతని ఆసుపత్రిలోనే వేణు పనిచేయాలని ముందుగానే నిర్ణయించి ఉంటారు. వేణు, శాంత వేరేవారిని పెళ్ళి చేసుకుందని విచారిస్తాడు. కానీ, చివరకు రంగమ్మనే చీకటిలో తాళి కట్టి, అది లక్ష్మీపతి కట్టాడని లోకాన్ని నమ్మించి ఉంటుంది. అదే తీరున వేణు, రంగమ్మ కూతురు పెళ్ళిలో లైట్లు ఆర్పేసి, చివరకు ఆమె కోరుకున్న బావతో పెళ్ళి జరిపిస్తారు. తరువాత అదే పీటలపై వేణు, శాంత పెళ్ళి దగ్గరుండి లక్ష్మీపతి చేయిస్తాడు. ఇది అన్యాయమని అరచిన ఊళ్ళో వాళ్ళకు రంగమ్మ చేసిన మోసం గురించి వివరిస్తాడు లక్ష్మీపతి. చివరకు విషయం తెలుసుకున్న సుందరమ్మ కూడా కొడుకు పెళ్ళి శాంతతో జరగాలనే ఆశిస్తుంది. ఆ రెండు జంటలు ఈడూజోడూ కుదిరిందని లక్ష్మీపతి అంటూ ఆశీర్వదించడంతో కథ సుఖాంతమవుతుంది.
Read Also:DK Shivakumar: నన్ను కర్ణాటక సీఎం చేయండి.. కోరికను ఖర్గేకు తెలిపిన డీకేఎస్!
ఇందులో జమున నాయికగా నటించగా, గుమ్మడి, చలం, మణిమాల, రమణారెడ్డి, చదలవాడ, కేవీయస్ శర్మ, సూర్యకాంతం, హేమలత, మాలతి, లక్ష్మీకాంతమ్మ, అల్లు రామలింగయ్య ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి కథ, మాటలు పినిశెట్టి సమకూర్చగా, పాటలు ఆరుద్ర రాశారు. పెండ్యాల నాగేశ్వరరావు బాణీలు కట్టారు. ఇందులోని “ఇదేమి లాహిరి…ఇదేమి గారడీ…”, “చిరుగాలి వంటిది అరుదైన చిన్నది…”, “విష్ణుపదము మేము విడువము…”, “సూర్యుని చుట్టూ తిరుగుతువుంది భూలోకం…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో తిలక్ నిర్మించారు. ఈ చిత్రం విజయం సాధించడంతో హిందీలో సంజీవ్ కుమార్, మాలా సిన్హాతో ‘కంగన్’ పేరుతో తిలక్ రూపొందించారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!