DK Shivakumar: నన్ను కర్ణాటక సీఎం చేయండి.. కోరికను ఖర్గేకు తెలిపిన డీకేఎస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: కర్ణాటక సీఎం ఎవరనే విషయంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ తనకు తల్లి లాంటిదని, వెన్నుపోటు పొడవబోనని, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడనని హస్తినకు వెళ్లటానికి ముందు డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు కారణమని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి. అయితే సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధరామయ్య, శివకుమార్లు కూడా పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో విడివిడిగా భేటీ అయ్యారు. కాగా, కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధరామయ్య వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం ఎంపికపై పార్టీ అధిష్ఠానం బుధవారం నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో ఉన్న కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ మంగళవారం ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. 2019లో తమ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత రాష్ట్రంలో పార్టీని పునర్నిర్మించేందుకు తాను సహాయం చేశానని, శివకుమార్ తదుపరి సీఎం కావాలనే కోరికను ఖర్గేకు తెలియజేశారు.
మే 10న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరూ కాంగ్రెస్ నాయకత్వాన్ని కలవడానికి ఢిల్లీకి చేరుకున్నారు. ఖర్గేతో జరిగిన సమావేశంలో సిద్ధరామయ్యకు సీఎం అయ్యే అవకాశం ఇప్పటికే లభించిందని, ఇప్పుడు తన వంతు వచ్చిందని శివకుమార్ కాంగ్రెస్ చీఫ్తో చెప్పారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. తనకు సీఎం కుర్చీ దక్కకపోతే పార్టీలో ఎమ్మెల్యేగా మాత్రమే పనిచేయడానికే ప్రాధాన్యత ఇస్తానని కూడా చెప్పారు. సిద్ధరామయ్య సీఎంగా కొనసాగడం ‘తప్పుడు పాలన’ అని, కర్ణాటకలోని ప్రముఖ వర్గమైన లింగాయత్లు మాజీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్నారని శివకుమార్ ఖర్గేతో అన్నారు.
Also Read
- Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
- Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
- Mamata Banerjee: రాజీనామాకు ససేమిరా.. సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ..
Read Also: Trimbakeshwar Temple: త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించిన నలుగురు ముస్లిం యువకులు అరెస్ట్
యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీలతో రహస్య ఓటింగ్ ఫలితాలపై చర్చించిన తర్వాత కర్ణాటక తదుపరి సీఎంను కాంగ్రెస్ చీఫ్ నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సోనియా గాంధీ ప్రస్తుతం సిమ్లాలో ఉన్నారు. సోమవారం, కర్ణాటకకు చెందిన ముగ్గురు పరిశీలకులు ఖర్గేకు తమ నివేదికను సమర్పించారు. పార్టీ నేతల సమావేశం ఐదు గంటలకు పైగా కొనసాగింది. ఇద్దరు బలమైన నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సీఎం పదవిని ఆశిస్తుండటం వల్ల ఎవరికి పట్టం కట్టాలనే విషయమై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఇద్దరిలో ఏ ఒక్కరిని ఎంపిక చేసినా మరొకరు అసంతృప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకోగా, అధికార బీజేపీ 66 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. రాష్ట్రంలో కింగ్మేకర్గా అవతరించాలని భావించిన జేడీ(ఎస్) 19 స్థానాలకు పరిమితమైంది.
తాజావార్తలు
-
Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!
-
Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
-
Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
-
Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!