Jabardasth Venu: బలగం వివాదం.. దిల్ రాజుతో కాదు దమ్ముంటే నాతో మాట్లాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jabardasth Venu: సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఒకరు అనుకున్న కథ.. ఇంకొకరి మదిలో కూడా మెదులుతూ ఉంటుంది. వారిద్దరిలో ఎవరి సినిమా మొదట వస్తే రెండో వ్యక్తి ఆ కథ తనదే అని కాపీ రైట్స్ కేసు పెడుతూ ఉంటాడు. ఇది చాలాసార్లు చాలా చోట్ల జరిగేదే. తాజాగా జబర్దస్త్ వేణు సైతం ఈ కాపీ రైట్స్ ఇష్యూస్ ఎదుర్కొంటున్నాడు. బలగం సినిమాతో వేణు దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించడంతో సినిమాపై అంచనాలు పెరిగి ప్రేక్షకులు థియేటర్ వైపు అడుగులు వేశారు. అనుకున్నట్లుగానే సినిమా మంచి విజయం అందుకుంది. ఈలోపే ఆ సినిమా కథ నాది అంటూ పాత్రికేయుడు గడ్డం సతీష్, వేణుపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. 2011 లో ఆ కథను తాను రాసుకున్నాను అని, అది తన తాతగారు చనిపోయాక తాను ఎంతో మనోవేదనతోరాసుకున్న కథ అని చెప్పుకొచ్చాడు. 2014 లో పచ్చికి అనే పేరుతో ప్రచురితమయిందని, దాన్ని కాపీ కొట్టి వేణు ఈ సినిమా తీసినట్లు తెలిపాడు. సినిమాకు రివ్యూ రాద్దామని ప్రివ్యూ కు వెళ్లిన తనకు తన కథను తనకే చూపించారని వాపోయాడు.
Ajith- Shalini: షాలినిని పెళ్లి చేసుకోవద్దు.. అజిత్ కు వార్నింగ్ ఇచ్చిన నటుడు
Also Read
ఇక సతీష్ వ్యాఖ్యలను వేణు ఖండించాడు. ఆ సినిమా సతీష్ ది కాదని వాదించాడు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో వేణు మాట్లాడుతూ.. ” గడ్డం సతీష్ బలగం కథ నాదే అనడం హాస్యాస్పదంగా ఉంది. ఆయన రాసిన కథను నేను చదవేలేదు. నా కథ చరిత్రలో ఉన్న సంప్రదాయం.. పిట్ట ముట్టుడు సంప్రదాయం ఎవరి సొత్తు కాదు. తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిపై ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తారు..సతీష్ మా సినిమాను అబాసుపాలు చేయడం సబబు కాదు.. ఇప్పటివరకు రచయితల సంఘాన్ని సతీష్ గడ్డం ఎందుకు సంప్రదించలేదు. దిల్ రాజు ఈ సినిమాను తీయకపోతే తెలంగాణ సంస్కృతిలో ఈ పాయింట్ ప్రపంచానికి ఎలా తెలిసేది.. మా బలగం సినిమా వల్ల ఎన్నో మంచి కథలు రాబోతున్నాయి. సతీష్.. దిల్ రాజుతో కాదు నాతో మాట్లాడు.. ఆయన బొమ్మ పెట్టుకొని సతీష్ చిల్లర వ్యాపారం చేస్తున్నాడు. బలగం సినిమాకు దిల్ రాజు ముందు ఉండటం వల్ల తెలంగాణ సంస్కృతి ఏంటో తెలిసింది. అసలు బలగం కథ మా ఇంట్లోనే జరిగింది. మా నాన్న చనిపోయినప్పుడు ఆ ఆలోచన నాలో మెదిలింది. ఆరేళ్ళు పరిశోధన చేసి ఈ కథను రాసుకున్నాను. నేను రాసింది కథ కాదు ప్రజల జీవితాల్లో జరిగే చర్యలు.. దమ్ముంటే నాతో మాట్లాడు సతీష్.. నేను చెప్తాను” అంటూ వేణు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం వేణు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!