Jabardasth Venu: బలగం వివాదం.. దిల్ రాజుతో కాదు దమ్ముంటే నాతో మాట్లాడు
Jabardasth Venu: సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఒకరు అనుకున్న కథ.. ఇంకొకరి మదిలో కూడా మెదులుతూ ఉంటుంది. వారిద్దరిలో ఎవరి సినిమా మొదట వస్తే రెండో వ్యక్తి ఆ కథ తనదే అని కాపీ రైట్స్ కేసు పెడుతూ ఉంటాడు. ఇది చాలాసార్లు చాలా చోట్ల జరిగేదే. తాజాగా జబర్దస్త్ వేణు సైతం ఈ కాపీ రైట్స్ ఇష్యూస్ ఎదుర్కొంటున్నాడు. బలగం సినిమాతో వేణు దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించడంతో సినిమాపై అంచనాలు పెరిగి ప్రేక్షకులు థియేటర్ వైపు అడుగులు వేశారు. అనుకున్నట్లుగానే సినిమా మంచి విజయం అందుకుంది. ఈలోపే ఆ సినిమా కథ నాది అంటూ పాత్రికేయుడు గడ్డం సతీష్, వేణుపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. 2011 లో ఆ కథను తాను రాసుకున్నాను అని, అది తన తాతగారు చనిపోయాక తాను ఎంతో మనోవేదనతోరాసుకున్న కథ అని చెప్పుకొచ్చాడు. 2014 లో పచ్చికి అనే పేరుతో ప్రచురితమయిందని, దాన్ని కాపీ కొట్టి వేణు ఈ సినిమా తీసినట్లు తెలిపాడు. సినిమాకు రివ్యూ రాద్దామని ప్రివ్యూ కు వెళ్లిన తనకు తన కథను తనకే చూపించారని వాపోయాడు.
Ajith- Shalini: షాలినిని పెళ్లి చేసుకోవద్దు.. అజిత్ కు వార్నింగ్ ఇచ్చిన నటుడు
Also Read
- Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
- Peddi: రామ్ చరణ్ 'పెద్ది' నుండి బ్లాస్టింగ్ సాంగ్ దిగుతోంది!
- Sandeep Virk: క్యాస్టింగ్ కౌచ్పై నటి షాకింగ్ కామెంట్స్.. "రాత్రి 12 గంటలకు నా రూమ్లోకి వచ్చి .. ఆ పని చేయమన్నాడు!"
- Venkatesh: మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
ఇక సతీష్ వ్యాఖ్యలను వేణు ఖండించాడు. ఆ సినిమా సతీష్ ది కాదని వాదించాడు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో వేణు మాట్లాడుతూ.. ” గడ్డం సతీష్ బలగం కథ నాదే అనడం హాస్యాస్పదంగా ఉంది. ఆయన రాసిన కథను నేను చదవేలేదు. నా కథ చరిత్రలో ఉన్న సంప్రదాయం.. పిట్ట ముట్టుడు సంప్రదాయం ఎవరి సొత్తు కాదు. తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిపై ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తారు..సతీష్ మా సినిమాను అబాసుపాలు చేయడం సబబు కాదు.. ఇప్పటివరకు రచయితల సంఘాన్ని సతీష్ గడ్డం ఎందుకు సంప్రదించలేదు. దిల్ రాజు ఈ సినిమాను తీయకపోతే తెలంగాణ సంస్కృతిలో ఈ పాయింట్ ప్రపంచానికి ఎలా తెలిసేది.. మా బలగం సినిమా వల్ల ఎన్నో మంచి కథలు రాబోతున్నాయి. సతీష్.. దిల్ రాజుతో కాదు నాతో మాట్లాడు.. ఆయన బొమ్మ పెట్టుకొని సతీష్ చిల్లర వ్యాపారం చేస్తున్నాడు. బలగం సినిమాకు దిల్ రాజు ముందు ఉండటం వల్ల తెలంగాణ సంస్కృతి ఏంటో తెలిసింది. అసలు బలగం కథ మా ఇంట్లోనే జరిగింది. మా నాన్న చనిపోయినప్పుడు ఆ ఆలోచన నాలో మెదిలింది. ఆరేళ్ళు పరిశోధన చేసి ఈ కథను రాసుకున్నాను. నేను రాసింది కథ కాదు ప్రజల జీవితాల్లో జరిగే చర్యలు.. దమ్ముంటే నాతో మాట్లాడు సతీష్.. నేను చెప్తాను” అంటూ వేణు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం వేణు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
-
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
-
Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో