Jabardasth Venu: బలగం వివాదం.. దిల్ రాజుతో కాదు దమ్ముంటే నాతో మాట్లాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jabardasth Venu: సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఒకరు అనుకున్న కథ.. ఇంకొకరి మదిలో కూడా మెదులుతూ ఉంటుంది. వారిద్దరిలో ఎవరి సినిమా మొదట వస్తే రెండో వ్యక్తి ఆ కథ తనదే అని కాపీ రైట్స్ కేసు పెడుతూ ఉంటాడు. ఇది చాలాసార్లు చాలా చోట్ల జరిగేదే. తాజాగా జబర్దస్త్ వేణు సైతం ఈ కాపీ రైట్స్ ఇష్యూస్ ఎదుర్కొంటున్నాడు. బలగం సినిమాతో వేణు దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించడంతో సినిమాపై అంచనాలు పెరిగి ప్రేక్షకులు థియేటర్ వైపు అడుగులు వేశారు. అనుకున్నట్లుగానే సినిమా మంచి విజయం అందుకుంది. ఈలోపే ఆ సినిమా కథ నాది అంటూ పాత్రికేయుడు గడ్డం సతీష్, వేణుపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. 2011 లో ఆ కథను తాను రాసుకున్నాను అని, అది తన తాతగారు చనిపోయాక తాను ఎంతో మనోవేదనతోరాసుకున్న కథ అని చెప్పుకొచ్చాడు. 2014 లో పచ్చికి అనే పేరుతో ప్రచురితమయిందని, దాన్ని కాపీ కొట్టి వేణు ఈ సినిమా తీసినట్లు తెలిపాడు. సినిమాకు రివ్యూ రాద్దామని ప్రివ్యూ కు వెళ్లిన తనకు తన కథను తనకే చూపించారని వాపోయాడు.
Ajith- Shalini: షాలినిని పెళ్లి చేసుకోవద్దు.. అజిత్ కు వార్నింగ్ ఇచ్చిన నటుడు
Also Read
- SIIMA 2026 Nominations: సైమా 2026 నామినేషన్స్ వచ్చేశాయ్.. తెలుగు నుంచి ఈ సినిమాదే హవా!
- Kajal Aggarwal: "అతను నా పర్మిషన్ లేకుండానే కారవాన్లోకి వచ్చాడు".. తర్వాత ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
- Sumanth: 'నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు..' అంత మాట అనేశాడేంటి?
- NBK111: సర్జరీ అయినా తగ్గేదేలే.. బాలయ్య మొండితనానికి ఫ్యాన్స్ ఫిదా! అక్టోబర్ 1 నుంచి NBK111 షూటింగ్?
ఇక సతీష్ వ్యాఖ్యలను వేణు ఖండించాడు. ఆ సినిమా సతీష్ ది కాదని వాదించాడు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో వేణు మాట్లాడుతూ.. ” గడ్డం సతీష్ బలగం కథ నాదే అనడం హాస్యాస్పదంగా ఉంది. ఆయన రాసిన కథను నేను చదవేలేదు. నా కథ చరిత్రలో ఉన్న సంప్రదాయం.. పిట్ట ముట్టుడు సంప్రదాయం ఎవరి సొత్తు కాదు. తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిపై ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తారు..సతీష్ మా సినిమాను అబాసుపాలు చేయడం సబబు కాదు.. ఇప్పటివరకు రచయితల సంఘాన్ని సతీష్ గడ్డం ఎందుకు సంప్రదించలేదు. దిల్ రాజు ఈ సినిమాను తీయకపోతే తెలంగాణ సంస్కృతిలో ఈ పాయింట్ ప్రపంచానికి ఎలా తెలిసేది.. మా బలగం సినిమా వల్ల ఎన్నో మంచి కథలు రాబోతున్నాయి. సతీష్.. దిల్ రాజుతో కాదు నాతో మాట్లాడు.. ఆయన బొమ్మ పెట్టుకొని సతీష్ చిల్లర వ్యాపారం చేస్తున్నాడు. బలగం సినిమాకు దిల్ రాజు ముందు ఉండటం వల్ల తెలంగాణ సంస్కృతి ఏంటో తెలిసింది. అసలు బలగం కథ మా ఇంట్లోనే జరిగింది. మా నాన్న చనిపోయినప్పుడు ఆ ఆలోచన నాలో మెదిలింది. ఆరేళ్ళు పరిశోధన చేసి ఈ కథను రాసుకున్నాను. నేను రాసింది కథ కాదు ప్రజల జీవితాల్లో జరిగే చర్యలు.. దమ్ముంటే నాతో మాట్లాడు సతీష్.. నేను చెప్తాను” అంటూ వేణు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం వేణు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Shubman Gill: గిల్ ‘మాస్టర్ ప్లాన్’కి ఓకే చెప్పిన బీసీసీఐ.. శ్రీలంక సిరీస్కు ముందే అనూహ్య నిర్ణయం..
-
Priyanka Gandhi: గోమూత్ర వ్యాఖ్యలపై అభ్యంతరం.. ప్రియాంకాగాంధీకి విద్యావేత్తల లేఖ
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
Delhi: నిరసనకారులపై కేసులు కొట్టేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ఒక్క షరతు!
-
Telangana Govt: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!