గుమ్మడికాయ కొట్టేసిన “శాకుంతలం” టీం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ పాన్ ఇండియా పౌరాణిక చిత్రం “శాకుంతలం”. సమంత “శకుంతల”గా నటిస్తున్న ఈ సినిమాకు మేకర్స్ తాజాగా గుమ్మడికాయను కొట్టేశారు. తుది షెడ్యూల్ హైదరాబాద్లో పూర్తయ్యింది. దర్శకుడు గుణశేఖర్ కొన్ని కీలకమైన టాకీ సన్నివేశాలు, దుష్యంత్ పాత్రలో నటించిన హీరో దేవ్ మోహన్పై యుద్ధ ఎపిసోడ్ని ఇక్కడ రూపొందించారు. ఆగస్టు రెండో వారంలో ఈ సినిమాకు సంబంధించి సమంత తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. గుణశేఖర్ నేతృత్వంలోని పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించిన పనిని త్వరలో ప్రారంభిస్తుంది. విజువల్, గ్రాఫిక్స్ సినిమాలో మేజర్ పార్ట్. కెనడా, హాంకాంగ్, చైనాలకు చెందిన టాలెంటెడ్ నిపుణులు విజువలైజేషన్ సరిగ్గా రూపొందించడానికి విఎఫ్ఎక్స్ విభాగంలో పని చేస్తున్నారు. దర్శకుడు గుణశేఖర్ పోస్ట్ ప్రొడక్షన్ 10 నెలల కన్నా ఎక్కువ ఉండవచ్చని వెల్లడించాడు. 2022 ప్రారంభంలో “శాకుంతలం” ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Read Also : కేఆర్కేపై “ఫ్యామిలీ మ్యాన్” పరువు నష్టం దావా
Also Read
- Akkineni Nagarjuna : అఖిల్కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
- Double Occupancy OTT: పగలు అమ్మాయి.. రాత్రి అబ్బాయి.. ఓటీటీలోకి షాకింగ్ కాన్సెప్ట్ మూవీ
- Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. 'జైలర్' విలన్ వినాయకన్పై మరో కేసు
- Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా 'శ్రీశ్రీ'.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
సినిమాలో భారతదేశం ఉత్తర నేపథ్యంలో బృందావనం, కాశ్మీర్, హిమాలయాలు వంటి భారీ సెట్ ను ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ నిర్మించారు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో, రామోజీ ఫిల్మ్ సిటీ, అనంతగిరి కొండలు, వికారాబాద్ అడవులు, గండిపేట చెరువు, అన్నపూర్ణ స్టూడియోలలో సినిమా షూటింగ్ జరిగింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో ముందుగా అనుష్కను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఇంతకుముందే వారి కాంబినేషన్ లో వచ్చిన “రుద్రమదేవి” డిజాస్టర్ అయ్యింది. ఈ ఆఫర్ ను అనుష్క సున్నితంగా తిరస్కరించడంతో “శాకుంతలం” దగ్గరకు చేరుకుంది.
ఈ భారీ ప్రాజెక్ట్ ను గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సమంతా అక్కినేని ‘శకుంతల’ పాత్ర పోషిస్తుండగా, దేవ్ మోహన్ దుష్యంత్గా, అదితి బాలన్ గా అనసూయ, మోహన్ బాబు మహర్షి దుర్వాసుడు, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కన్పించబోతున్నారు. గౌతమి, యాంకర్ వర్షిణి తదితరులు కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే ‘అగ్ని పరీక్ష’!
-
Jaipur Murder: ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లిని మాత్రమే కాదు, తండ్రిని కూడా చంపింది.!
-
Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్లు మృతి
-
Petrol Diesel Price Hike: వామ్మో.. ఒకేసారి రూ.13 పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ దేశ ప్రభుత్వం సంచలన ప్రకటన!
-
PM Modi: న్యూజిలాండ్లో కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ .. ఆ గిఫ్ట్ను చూపిస్తూ స్టేజ్ పైనే భావోద్వేగం!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!