Ilaiyaraaja: అమ్మగా ‘మ్యూజిక్ స్కూల్’లోకి అడుగుపెట్టిన శ్రియా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో శర్మన్ జోషి, శ్రియా శరన్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ మూవీ హైదరాబాద్, గోవా సహా పలు ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుంది. తాజాగా హైదరాబాద్లో జరిగిన షెడ్యూల్తో షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాలో మొత్తం 11 పాటలున్నాయి. అందులో మూడు పాటలు కేవలం మ్యూజిక్తోనే సాగుతాయి. కిరణ్ డియోహన్స్ తన కెమెరా పనితనంతో విజువల్స్ను గ్రాండ్గా తెరకెక్కించి సినిమాను నెక్ట్స్ లెవల్లో తీసుకెళ్లారని రైటర్ కమ్ డైరెక్టర్ పాపారావు బియ్యాల భావిస్తున్నారు. అలాగే శర్మన్ జోషి, శ్రియా శరన్ తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారని ఆయన తెలిపారు.
Also Read
- Shreyas Talpade: ఆ స్టార్ యాక్టర్ సొంతింటి కల నిజం చేసిన షారుఖ్ ఖాన్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ మ్యాటర్!
- Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
- Samantha: పాత గాయాల్ని రేపుతున్న సమంత కామెంట్స్?
- Suriya: 'హోంబాలే'తో చేతులు కలిపిన సూర్య.. డైరెక్టర్ ఎవరంటే?

ఈ సందర్భంగా శ్రియా శరన్ మాట్లాడుతూ ”‘మ్యూజిక్ స్కూల్’ ఓ అద్భుతమైన స్క్రిప్ట్. తల్లిగా మారిన తర్వాత ఈ సినిమాలో నటించడానికి అంగీకరించాను. కాబట్టి ఈ సినిమా నాకెంతో ప్రత్యేకమైనది. నేను చిన్న పాపగా ఉన్నప్పటి నుంచి ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ వింటూ పెరిగాను. ఇప్పుడు వాటిలో కొన్నింటికి ‘మ్యూజిక్ స్కూల్’లో నటించటం అనేది గొప్ప వరంగా భావిస్తున్నాను. అద్భుతమైన నటీనటులు, చిన్న పిల్లలు, టెక్నికల్ టీమ్తో కలిసి ఈ సినిమా కోసం పని చేశాను. శర్మన్ జోషిగారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఆయన ఎప్పుడూ నేను నవ్వుతూ ఉండేలా చూసుకున్నారు. అలాగే యామిని రావుగారికి ధన్యవాదాలు. మా యూనిట్కు ఏది అవసరమో దాన్ని సమయానికి ఏర్పాటు చేయటంలో వారు ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఓ గొప్ప పాత్రను క్రియేట్ చేసి అందులో నన్ను నటింప చేసినందుకు దర్శకులు పాపారావుగారికి ధన్యవాదాలు. ఆయన తొలి సినిమా ఇది. అయినప్పటికీ ఆయన విజన్ ఎంతో గొప్పగా ఉంది. నా కలను నిజం చేసిన కిరణ్గారికి థాంక్స్. ఇది నాకెప్పటికీ గుర్తుండిపోయే సినిమా. ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నాను” అని అన్నారు.
శర్మన్ జోషి మాట్లాడుతూ ”మ్యూజిక్ స్కూల్’ సినిమా ప్రయాణం ముగిసింది. షూటింగ్ సమయంలో ఎంతో ఎంజాయ్ చేశాం. ఎన్నో అనుభూతులున్నాయి. వాటని ఇప్పుడు ప్రేక్షకులకు అందించబోతున్నాం. ఓ గొప్ప ప్యాషన్తో ఎవరూ ఊహించని విధంగా భారీ స్కేల్తో ఇలాంటి అద్భుతమైన సినిమా చేసిన ప్యాషనేట్ డైరెక్టర్ పాపారావుగారి నుంచి మరిన్ని గొప్ప చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
యామిని ఫిలింస్ బ్యానర్ రూపొందించిన ఈ చిత్రంలో శ్రియా శరన్, శర్మన్ జోషి, షాన్, ప్రకాష్ రాజ్, లీలా శామ్సన్, సుహాసిని ములే, బెంజిమన్ గిలాని, శ్రీకాంత్ అయ్యంగార్, వినయ్ వర్మ, మోనా అంబేగోనకర్, గ్రేసీ గోస్వామి, ఓజు బారువా, బగ్గ్ భార్గవ, మంగళ భట్, ఫణి ఎగ్గొట్టి, వకార్ షేర్, ప్రవీణ్ గోయెల్, రజినీష్ కార్తికేయ, రోహన్ రాయ్, ఒలివియా చారన్, వివాన్ జైన్, సిద్ధిక్ష, ఆద్య, ఖుషి తదితరులు నటించారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!