శ్రియా, శర్మన్ జోషి జంటగా నటించిన 'మ్యూజిక్ స్కూల్' మూవీ ట్రైలర్ ను ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.
మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో శర్మన్ జోషి, శ్రియా శరన్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ మూవీ హైదరాబాద్, గోవా సహా పలు ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుంది. తాజాగా హైదరాబాద్లో జరిగిన షెడ్యూల్తో షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాలో మొత్తం 11 పాటలున్నాయి. అందులో మూడు పాటలు కేవలం మ్యూజిక్తోనే సాగుతాయి. కిరణ్ డియోహన్స్ తన కెమెరా పనితనంతో విజువల్స్ను గ్రాండ్గా తెరకెక్కించి సినిమాను నెక్ట్స్…