V.N. Aditya: ఏ సినిమాకూ పడని టెన్షన్ దీనికి పడ్డాను!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మనసంతా నువ్వే’, ‘నేనున్నాను’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన వి.ఎన్. ఆదిత్య తాజాగా తెరకెక్కించిన సినిమా ‘వాళ్లిద్దరి మధ్య’. శుక్రవారం నుండి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రీమియర్ షో అనంతం చిత్ర బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ, ”ఈ సినిమాకు పడినంత టెన్షన్ నా గత చిత్రాలకు ఎప్పుడూ పడలేదు. 2011లో ‘ముగ్గురు’ సినిమా తర్వాత కొంతకాలం నేను యూఎస్ కు వెళ్ళాను. అక్కడ నుండి వచ్చేసరికీ ఇక్కడ సినిమా రంగంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాకు దర్శకత్వం వహించడం నావల్ల కాదనే నిర్ణయానికి వచ్చేశాను. ఓ సినిమాను తీసినా విడుదల చేయడానికి ఎలాంటి కష్టాలు పడాలో కదా అనిపించేది. అటువంటి సమయంలో నిర్మాత అర్జున్ దాస్యన్ నన్ను ప్రోత్సహించి, నాతో ఈ సినిమా నిర్మించారు. నిజానికి దీని తర్వాత చేసిన ‘డియర్ మేఘా’ చిత్రం విడుదలై పోయింది. మరో చిత్రమూ అతి త్వరలో విడుదల కాబోతోంది. మా సినిమా కూడా శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. కంటెంట్ మీద నమ్మకంతో ఈ సినిమాను నిర్మించిన అలాంటి నిర్మాతను నేనింతవరకూ చూడలేదు. ఈ సినిమాను వ్యూవర్స్ ఆదరిస్తే… ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ మరిన్ని వస్తాయి. విరాజ్ అశ్విన్, నేహా కృష్ణకు మంచి గుర్తింపు వస్తుంది. అలానే మధు స్రవంతి ఈ సినిమాకు చక్కని సంగీతం సమకూర్చారు. ఆమె బలమైన కోరిక కారణంగా బాలు గారు ఇందులో ఓ పాట పాడారు. అది జీవితంలో మర్చిపోలేని విషయం. ఈ చిత్ర నిర్మాణంలో మాకు ప్రసాద్స్ అధినేత రమేశ్ ప్రసాద్ చక్కని సహకారం అందించారు” అని అన్నారు.
తాను సినిమా చేయమని కోరిన వెంటనే వి.ఎన్. ఆదిత్య అంగీకరించలేదని, దాదాపు మూడు నెలల పాటు తాను సినిమా పూర్తి చేయగలనా లేదా అని పరీక్షించారని, జనాలకు ఈ చిత్రం నచ్చుతుందనే నమ్మకం ఉందని నిర్మాత అర్జున్ అన్నారు. నటుడిగా తనకిది రెండో సినిమా అని, అందులో రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం ఛాలెంజ్ గా తీసుకున్నానని, అందరి సహకారంతో సినిమాను పూర్తి చేశామని హీరో విరాజ్ అశ్విన్ తెలిపారు. ఆహా ద్వారా ఈ సినిమాను జనం ముందుకు తీసుకురావడం పట్ల కంటెంట్ హెడ్ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీజీ విందా హాజరయ్యారు. ఇందులో నటి జయశ్రీ రాచకొండ, మాటల రచయిత వెంకట్ డి. పతి తదితరులు పాల్గొన్నారు.
Also Read
- Kiran Abbavaram: 'మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..' ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
- Vallabhaneni Anil: జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్ వివాదం కాదు.. తప్పు చేస్తే ఫెడరేషన్ శిక్షిస్తుంది!
- Posani Krishna Murali: 'లవ్ యూ రాజా' డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
- Fauji: ప్రభాస్ 'ఫౌజీ' చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
తాజావార్తలు
-
Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
-
CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
-
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
-
UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
-
Kiran Abbavaram: ‘మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..’ ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!