V.N. Aditya: ఏ సినిమాకూ పడని టెన్షన్ దీనికి పడ్డాను!
‘మనసంతా నువ్వే’, ‘నేనున్నాను’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన వి.ఎన్. ఆదిత్య తాజాగా తెరకెక్కించిన సినిమా ‘వాళ్లిద్దరి మధ్య’. శుక్రవారం నుండి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రీమియర్ షో అనంతం చిత్ర బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ, ”ఈ సినిమాకు పడినంత టెన్షన్ నా గత చిత్రాలకు ఎప్పుడూ పడలేదు. 2011లో ‘ముగ్గురు’ సినిమా తర్వాత కొంతకాలం నేను యూఎస్ కు వెళ్ళాను. అక్కడ నుండి వచ్చేసరికీ ఇక్కడ సినిమా రంగంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాకు దర్శకత్వం వహించడం నావల్ల కాదనే నిర్ణయానికి వచ్చేశాను. ఓ సినిమాను తీసినా విడుదల చేయడానికి ఎలాంటి కష్టాలు పడాలో కదా అనిపించేది. అటువంటి సమయంలో నిర్మాత అర్జున్ దాస్యన్ నన్ను ప్రోత్సహించి, నాతో ఈ సినిమా నిర్మించారు. నిజానికి దీని తర్వాత చేసిన ‘డియర్ మేఘా’ చిత్రం విడుదలై పోయింది. మరో చిత్రమూ అతి త్వరలో విడుదల కాబోతోంది. మా సినిమా కూడా శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. కంటెంట్ మీద నమ్మకంతో ఈ సినిమాను నిర్మించిన అలాంటి నిర్మాతను నేనింతవరకూ చూడలేదు. ఈ సినిమాను వ్యూవర్స్ ఆదరిస్తే… ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ మరిన్ని వస్తాయి. విరాజ్ అశ్విన్, నేహా కృష్ణకు మంచి గుర్తింపు వస్తుంది. అలానే మధు స్రవంతి ఈ సినిమాకు చక్కని సంగీతం సమకూర్చారు. ఆమె బలమైన కోరిక కారణంగా బాలు గారు ఇందులో ఓ పాట పాడారు. అది జీవితంలో మర్చిపోలేని విషయం. ఈ చిత్ర నిర్మాణంలో మాకు ప్రసాద్స్ అధినేత రమేశ్ ప్రసాద్ చక్కని సహకారం అందించారు” అని అన్నారు.
తాను సినిమా చేయమని కోరిన వెంటనే వి.ఎన్. ఆదిత్య అంగీకరించలేదని, దాదాపు మూడు నెలల పాటు తాను సినిమా పూర్తి చేయగలనా లేదా అని పరీక్షించారని, జనాలకు ఈ చిత్రం నచ్చుతుందనే నమ్మకం ఉందని నిర్మాత అర్జున్ అన్నారు. నటుడిగా తనకిది రెండో సినిమా అని, అందులో రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం ఛాలెంజ్ గా తీసుకున్నానని, అందరి సహకారంతో సినిమాను పూర్తి చేశామని హీరో విరాజ్ అశ్విన్ తెలిపారు. ఆహా ద్వారా ఈ సినిమాను జనం ముందుకు తీసుకురావడం పట్ల కంటెంట్ హెడ్ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీజీ విందా హాజరయ్యారు. ఇందులో నటి జయశ్రీ రాచకొండ, మాటల రచయిత వెంకట్ డి. పతి తదితరులు పాల్గొన్నారు.
Also Read
- Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్... 'పెద్ది' రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్కు పండగే!
- Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
- Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
- Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ 'టాక్సిక్' రిలీజ్ అప్పుడేనా?
తాజావార్తలు
-
Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్
-
LSG vs KKR: షమీ లాస్ట్ బాల్ సిక్స్, రింకు ఫస్ట్ బాల్ ఫోర్.. సూపర్ ఓవర్లో లక్నోను చిత్తు చేసిన కేకేఆర్
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!