V.N. Aditya: ఏ సినిమాకూ పడని టెన్షన్ దీనికి పడ్డాను!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మనసంతా నువ్వే’, ‘నేనున్నాను’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన వి.ఎన్. ఆదిత్య తాజాగా తెరకెక్కించిన సినిమా ‘వాళ్లిద్దరి మధ్య’. శుక్రవారం నుండి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రీమియర్ షో అనంతం చిత్ర బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ, ”ఈ సినిమాకు పడినంత టెన్షన్ నా గత చిత్రాలకు ఎప్పుడూ పడలేదు. 2011లో ‘ముగ్గురు’ సినిమా తర్వాత కొంతకాలం నేను యూఎస్ కు వెళ్ళాను. అక్కడ నుండి వచ్చేసరికీ ఇక్కడ సినిమా రంగంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాకు దర్శకత్వం వహించడం నావల్ల కాదనే నిర్ణయానికి వచ్చేశాను. ఓ సినిమాను తీసినా విడుదల చేయడానికి ఎలాంటి కష్టాలు పడాలో కదా అనిపించేది. అటువంటి సమయంలో నిర్మాత అర్జున్ దాస్యన్ నన్ను ప్రోత్సహించి, నాతో ఈ సినిమా నిర్మించారు. నిజానికి దీని తర్వాత చేసిన ‘డియర్ మేఘా’ చిత్రం విడుదలై పోయింది. మరో చిత్రమూ అతి త్వరలో విడుదల కాబోతోంది. మా సినిమా కూడా శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. కంటెంట్ మీద నమ్మకంతో ఈ సినిమాను నిర్మించిన అలాంటి నిర్మాతను నేనింతవరకూ చూడలేదు. ఈ సినిమాను వ్యూవర్స్ ఆదరిస్తే… ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ మరిన్ని వస్తాయి. విరాజ్ అశ్విన్, నేహా కృష్ణకు మంచి గుర్తింపు వస్తుంది. అలానే మధు స్రవంతి ఈ సినిమాకు చక్కని సంగీతం సమకూర్చారు. ఆమె బలమైన కోరిక కారణంగా బాలు గారు ఇందులో ఓ పాట పాడారు. అది జీవితంలో మర్చిపోలేని విషయం. ఈ చిత్ర నిర్మాణంలో మాకు ప్రసాద్స్ అధినేత రమేశ్ ప్రసాద్ చక్కని సహకారం అందించారు” అని అన్నారు.
తాను సినిమా చేయమని కోరిన వెంటనే వి.ఎన్. ఆదిత్య అంగీకరించలేదని, దాదాపు మూడు నెలల పాటు తాను సినిమా పూర్తి చేయగలనా లేదా అని పరీక్షించారని, జనాలకు ఈ చిత్రం నచ్చుతుందనే నమ్మకం ఉందని నిర్మాత అర్జున్ అన్నారు. నటుడిగా తనకిది రెండో సినిమా అని, అందులో రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం ఛాలెంజ్ గా తీసుకున్నానని, అందరి సహకారంతో సినిమాను పూర్తి చేశామని హీరో విరాజ్ అశ్విన్ తెలిపారు. ఆహా ద్వారా ఈ సినిమాను జనం ముందుకు తీసుకురావడం పట్ల కంటెంట్ హెడ్ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీజీ విందా హాజరయ్యారు. ఇందులో నటి జయశ్రీ రాచకొండ, మాటల రచయిత వెంకట్ డి. పతి తదితరులు పాల్గొన్నారు.
Also Read
- Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
- The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న 'ది ఇండియా స్టోరీ' టీజర్
- Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
- Varanasi Update: 'వారణాసి' నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
తాజావార్తలు
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?