సోషల్ మీడియా వచ్చాక గాసిప్స్ కు కొదువే లేదు. నెటిజన్స్ ఏ భయం, బెరుకు లేకుండా తమ మనసులోని భావాలను, అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. తమ అభిమాన హీరోలు, హీరోయిన్లు పెట్టే పోస్టుల కింద తమ అభిప్రాయాలను, అనుమానాలను కామెంట్స్ రూపంలో చెప్తూ ఉంటారు. అవి కొన్నిసార్లు వైరల్ గా మారుతూ ఉంటాయి. వాటినే కొన్ని వెబ్ సైట్లు నెటిజన్స్ కామెంట్స్ అంటూ రాస్తూ ఉండడం నిత్యం జరిగేదే. ఆ వార్తలో ఉన్నది నిజమా..? అబద్దమా..? అని సదురు హీరో కానీ, హీరోయిన్ కానీ కన్ఫర్మ్ చేస్తే అభిమానులు ఆనందిస్తారు. అయితే ఇలాంటి వార్తలపై కొందరు స్పందిస్తారు.. మరికొందరు చదివి వదిలేస్తారు. తాజాగా హీరోయిన్ పూనమ్ కౌర్ తనపై వచ్చిన ఒక వార్తపై స్పందించింది. ఇటీవల ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేస్తూ మై హ్యాపీనెస్ అని క్యాప్షన్ పెట్టింది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్స్ ఆ పిల్లలు ఎవరో చెప్పొచ్చు కదా.. అని కొందరు.. ఏంటీ పూనమ్ పెళ్లి చేసుకుందా ..? అని మరికొందరు కామెంట్స్ పెట్టారు.
Read Also: COVID variant XE : ఎక్స్ఈ వేరియంట్.. పరిశోధనలో సంచలన అంశాలు..!
ఇక ఈ కామెంట్స్ కాస్తా వైరల్ కావడంతో పలు వెబ్ సైట్స్ నెటిజెన్స్ ఇలా కామెంట్స్ చేస్తున్నారు అని రాసుకొచ్చాయి. ఇక ఈ వార్తలపై పూనమ్ స్పందిస్తూ ఆ పిల్లలు ఎవరో క్లారిటీ ఇచ్చింది. “‘‘ఇప్పటివరకూ జరిగిన డ్యామేజ్ చాలు, ఈ ఫోటోలు ఉన్నది నా స్నేహితుల పిల్లలు.. సోషల మీడియా థాంక్స్.. నేను క్లారిటీ ఇవ్వగలను.. నన్ను ఊపిరి పీల్చుకోనివ్వండి’’ అని రాసుకొచ్చింది. ఇక ఈ ట్వీట్ పై నెటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న వాటికి క్లారిటీలు ఇవ్వడం కాదు.. ఇవ్వాల్సిన వాటికి క్లారిటీ ఇవ్వు చాలు అని కొందరు.. మీరు క్లారిటీ ఇవ్వడం కోసమే రాసి ఉంటారులే అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
Enough unbearable damage has been done , these are my best friends kids. Thankful to social media , that I can give clarity. 🙏
Let me breathe🙏 pic.twitter.com/4yyCPMuRDn
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 4, 2022