దేశంలో కరోనా కేసులు… మళ్లీ పెరుగుతున్నాయి. కొంతకాలంగా బాగా తగ్గిన పాజిటివిటీ రేటు… అనూహ్యంగా పెరుగుతోంది. ఇక, ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్ఈ మొదటి కేసు వెలుగులోకి వచ్చింది. అత్యంత సాంక్రమిక శక్తి ఉన్నట్లు భావిస్తోన్న… ఈ వేరియంట్ గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. తాజాగా వైరస్ జన్యుక్రమాన్ని గుర్తించే ల్యాబొరేటరీల ఇన్సాకాగ్… ఎక్స్ఈ వేరియంట్పై క్లారిటీ ఇచ్చింది. BA.2.10, BA.2.12.. BA.2 ఉప రకాలుగా గుర్తించినట్లు నిపుణులు తెలిపారు. BA.2 పాత సీక్వెన్సులే కొత్త వాటిగా వర్గీకరణ చేశారు. ఇవి వైరస్ తీవ్రతను పెంచుతాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. గత వారంతో పోల్చితే 12 రాష్ట్రాల్లో క్రమంగా వైరస్ ఉధృతి పెరుగుతోంది.
Read Also: Ukraine Russia War: అమ్మాయిలపైనే కాదు.. బాలురపై అత్యాచారాలు..!
మరోవైపు, ఒమిక్రాన్ ఉపరకాలైన బీఏ.1, బీఏ.2ల కలయికగా అనుమానిస్తున్న ఎక్స్ఈ వేరియంట్.. తొలిసారి బ్రిటన్లో వెలుగుచూసింది. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకూ పాకింది. కొద్ది వారాల క్రితం ఈ వేరియంట్ కేసులు గుజరాత్, మహారాష్ట్రలో నమోదైనట్లు స్థానిక ప్రభుత్వాలు వెల్లడించాయి. కొత్త వేరియంట్ వ్యాప్తి, తీవ్రతపై స్పష్టత లేకపోయినా… ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ వేరియంట్కు అధిక సాంక్రమికశక్తి కలిగి ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇతర ఉత్పరివర్తనాల కంటే వ్యాపించే గుణం ఎక్స్ఈ వేరియంట్కు దాదాపు 10శాతం ఎక్కువ ఉన్నట్లు బ్రిటన్ పరిశోధకులు అంచనా వేశారు. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల ఉనికి కనిపిస్తున్నప్పటికీ.. కరోనా కొత్త కేసుల సంఖ్య మాత్రం అదుపులోనే ఉంది. వ్యాక్సినేషన్, కరోనా కారణంగా సహజంగా సంక్రమించిన రోగనిరోధకత.. వైరస్ కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.