YVLN Shastri: సినీ రచయిత, సెన్సార్ బోర్డ్ మెంబర్ యడవల్లి కన్నుమూత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YVLN Shastri: పలు తెలుగు, కన్నడ చిత్రాలకు రచన చేసిన యడవల్లి వేంకట లక్ష్మీ నరసింహశాస్త్రి (వైవీఎల్ ఎన్ శాస్త్రి) (75) అనారోగ్యంతో విజయవాడలో శనివారం రాత్రి కన్నుమూశారు. యడవల్లిగా చిత్రసీమలో ప్రసిద్ధులు. వీరి స్వస్థలం నెల్లూరు. తండ్రి మునిసిపాలిటీ హెల్త్ ఆఫీసర్ గా పని చేసేవారు. విజయవాడలో స్థిరపడ్డారు. అక్కడే యడవల్లి స్కూల్ ఫైనల్ చదివారు. ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీలో పీయూసీ, లయోలా కాలేజీలో డిగ్రీ, తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు. చిన్నతనం నుంచి సాహిత్యంలో ప్రవేశం ఉంది. యుక్త వయసులోనే ‘నక్షత్రాలు’ పేరుతో వచన కవితా సంపుటిని వెలువరించారు. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన వచన కవితా సారథి కుందుర్తి ఆంజనేయులు, యడవల్లి కవితలను ప్రశంసించారు. ఈ పుస్తకాన్ని తన గురువు ఆరుద్రకి యడవల్లి అంకితం ఇచ్చారు. అలానే ‘విరిగిన కొమ్మకు విరిసిన మల్లెలు’ పేరుతో నవల రాశారు.
విజయవాడలో రాధాకృష్ణమూర్తి అనే సినీ నిర్మాత ద్వారా చిత్రసీమలోకి యడవల్లి అడుగు పెట్టారు. మాదిరెడ్డి సులోచన రాసిన ‘తరం మారింది’ అనే నవలను అదే పేరుతో రాధాకృష్ణమూర్తి తీసిన సినిమాకు తగిన విధంగా భాషనూ, యాసనూ సమకూర్చడానికి యడవల్లి సాయం చేశారు. అందుకోసం చెన్నై వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతో కలసి పని చేసే అవకాశం ఆయనకు దొరికింది. కమలాకర కామేశ్వరరావుతో కూడా పని చేశారు. విక్టరీ మధుసూదనరావుతో ఆయన సొంత సినిమా ‘ఆత్మకథ’కు వర్క్ చేశారు. యడవల్లిని నటీమణి లక్ష్మి కన్నడ సినీపరిశ్రమకు పరిచయం చేశారు. అప్పటి నుండీ తెలుగు సినిమాలతో పాటు కన్నడ చిత్రాలకు సైతం పని చేస్తూ ఉన్నారు. దాదాపు పదిహేను కన్నడ సినిమాలకు రచన చేశారు. ఓ తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘తెలుగు సినిమాల్లో హాస్యం’, ‘తెలుగు సినీ దర్శక మాలిక – విజయ వీచిక’, ‘తెలుగు చిత్రాలలో ప్రగతి కిరణాలు’ పుస్తకాలను రచించారు. పలు టీవీ సీరియల్స్ కు, కథలు – మాటలు సమకూర్చారు. శ్రీ యం. వెంకయ్య నాయుడు భారత ఉప రాష్ట్రపతిగా సేవలు అందిస్తున్న సమయం తన రచనలను వారికి అందించి, అభినందనలు పొందారు. యడవల్లి ప్రస్తుతం కేంద్ర సెన్సార్ బోర్డ్ (సీబీఎఫ్సీ) సభ్యునిగా, లాంగ్వేజ్ ఎక్స్ పెర్ట్ గా సేవలు అందిస్తున్నారు. అవివాహితులైన యడవల్లి డిసెంబర్ నెలాఖరులో అనారోగ్య కారణాలతో విజయవాడలోని తమ్ముడు నాగేశ్వరరావు చెంతకు చేరారు. దాదాపు యాభై రోజుల పాటు చికిత్స చేయించినా ఉపయోగం లేకపోయిందని, శనివారం రాత్రి యడవల్లి తుదిశ్వాస విడిచారని సోదరుడు తెలిపారు. ఆదివారం ఉదయం విజయవాడలో యడవల్లి అంత్యక్రియలు జరిగాయి.
Also Read
- K. Bhagyaraj : ప్రముఖ దర్శకులు, నటుడు కే భాగ్యరాజ్ మృతి..
- Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
- Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
- Dil Raju: 300 కోట్ల బడ్జెట్లో భారీ వాటా హీరోకే.. టాలీవుడ్పై దిల్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Moringa Health Benefits: మునగను ‘మిరాకిల్ ట్రీ’ అని ఎందుకు అంటారు? కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
-
Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
-
K. Bhagyaraj : ప్రముఖ దర్శకులు, నటుడు కే భాగ్యరాజ్ మృతి..
-
Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!