YVLN Shastri: సినీ రచయిత, సెన్సార్ బోర్డ్ మెంబర్ యడవల్లి కన్నుమూత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YVLN Shastri: పలు తెలుగు, కన్నడ చిత్రాలకు రచన చేసిన యడవల్లి వేంకట లక్ష్మీ నరసింహశాస్త్రి (వైవీఎల్ ఎన్ శాస్త్రి) (75) అనారోగ్యంతో విజయవాడలో శనివారం రాత్రి కన్నుమూశారు. యడవల్లిగా చిత్రసీమలో ప్రసిద్ధులు. వీరి స్వస్థలం నెల్లూరు. తండ్రి మునిసిపాలిటీ హెల్త్ ఆఫీసర్ గా పని చేసేవారు. విజయవాడలో స్థిరపడ్డారు. అక్కడే యడవల్లి స్కూల్ ఫైనల్ చదివారు. ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీలో పీయూసీ, లయోలా కాలేజీలో డిగ్రీ, తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు. చిన్నతనం నుంచి సాహిత్యంలో ప్రవేశం ఉంది. యుక్త వయసులోనే ‘నక్షత్రాలు’ పేరుతో వచన కవితా సంపుటిని వెలువరించారు. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన వచన కవితా సారథి కుందుర్తి ఆంజనేయులు, యడవల్లి కవితలను ప్రశంసించారు. ఈ పుస్తకాన్ని తన గురువు ఆరుద్రకి యడవల్లి అంకితం ఇచ్చారు. అలానే ‘విరిగిన కొమ్మకు విరిసిన మల్లెలు’ పేరుతో నవల రాశారు.
విజయవాడలో రాధాకృష్ణమూర్తి అనే సినీ నిర్మాత ద్వారా చిత్రసీమలోకి యడవల్లి అడుగు పెట్టారు. మాదిరెడ్డి సులోచన రాసిన ‘తరం మారింది’ అనే నవలను అదే పేరుతో రాధాకృష్ణమూర్తి తీసిన సినిమాకు తగిన విధంగా భాషనూ, యాసనూ సమకూర్చడానికి యడవల్లి సాయం చేశారు. అందుకోసం చెన్నై వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతో కలసి పని చేసే అవకాశం ఆయనకు దొరికింది. కమలాకర కామేశ్వరరావుతో కూడా పని చేశారు. విక్టరీ మధుసూదనరావుతో ఆయన సొంత సినిమా ‘ఆత్మకథ’కు వర్క్ చేశారు. యడవల్లిని నటీమణి లక్ష్మి కన్నడ సినీపరిశ్రమకు పరిచయం చేశారు. అప్పటి నుండీ తెలుగు సినిమాలతో పాటు కన్నడ చిత్రాలకు సైతం పని చేస్తూ ఉన్నారు. దాదాపు పదిహేను కన్నడ సినిమాలకు రచన చేశారు. ఓ తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘తెలుగు సినిమాల్లో హాస్యం’, ‘తెలుగు సినీ దర్శక మాలిక – విజయ వీచిక’, ‘తెలుగు చిత్రాలలో ప్రగతి కిరణాలు’ పుస్తకాలను రచించారు. పలు టీవీ సీరియల్స్ కు, కథలు – మాటలు సమకూర్చారు. శ్రీ యం. వెంకయ్య నాయుడు భారత ఉప రాష్ట్రపతిగా సేవలు అందిస్తున్న సమయం తన రచనలను వారికి అందించి, అభినందనలు పొందారు. యడవల్లి ప్రస్తుతం కేంద్ర సెన్సార్ బోర్డ్ (సీబీఎఫ్సీ) సభ్యునిగా, లాంగ్వేజ్ ఎక్స్ పెర్ట్ గా సేవలు అందిస్తున్నారు. అవివాహితులైన యడవల్లి డిసెంబర్ నెలాఖరులో అనారోగ్య కారణాలతో విజయవాడలోని తమ్ముడు నాగేశ్వరరావు చెంతకు చేరారు. దాదాపు యాభై రోజుల పాటు చికిత్స చేయించినా ఉపయోగం లేకపోయిందని, శనివారం రాత్రి యడవల్లి తుదిశ్వాస విడిచారని సోదరుడు తెలిపారు. ఆదివారం ఉదయం విజయవాడలో యడవల్లి అంత్యక్రియలు జరిగాయి.
Also Read
- Dancers Association Rift: 'ఉప ఎన్నికల'కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. 'పూర్తి ఎన్నికలు' కావాలంటున్న అసమ్మతి వర్గం!
- TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
- NBK 111 Release Date : సంక్రాంతి కాదు.. బాలయ్య - గోపీచంద్ మలినేని NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్?
- Mahendragiri Varahi : థియేటర్లలోకి వారాహి అమ్మవారి ఆగమనం.. 'మహేంద్రగిరి వారాహి' టీమ్ వినూత్న ప్రమోషన్స్!
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?