Dil raju: టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు వారసుడు సినిమాతో ఎక్కడలేని చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఒక వివాదం ముగిసింది అనేలోపు ఇంకొకటి.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విజయ్, రష్మిక జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రం వారిసు. తెలుగులో వారసుడు అనే పేరుతో రిలీజ్ కానుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక సంక్రాంతి సమయంలో డబ్బింగ్ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదని తెలుగు నిర్మాతలందరు కలిసి సినిమాను రిలీజ్ కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న విషయం విదితమే.దీనిపై త్వరలోనే స్పందిస్తానని ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నానని దిల్ రాజు ప్రకటించారు.
ఇక ఒక వివాదం ముగిసింది అనుకోలోపు మరో వివాదాన్ని తీసుకొచ్చాడు వారసుడు. ఈ సినిమాలో పర్మిషన్ లేకుండా జంతువులను వాడినందుకు జంతు పరిరక్షణ సమితి కేసు వేయడం హాట్ టాపిక్ గా మారింది. వారిసు సినిమాలో ఒక సీన్ లో ఎలిఫెంట్ ను ఉపయోగించారట. కానీ, ఏనుగును వాడినందుకు జంతు పరిరక్షణ సమితి నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదట. దీంతో జంతు పరిరక్షణ సమితి పర్మిషన్ లేకుండా షూటింగ్ చేశారని, వణ్యప్రాణి సంరక్షణ చట్టం 1972 రూల్ 7(2) షెడ్యూల్ 1 ప్రకారం నోటీసులు పంపింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి వీటన్నింటికి దిల్ రాజు ఎలా చెక్ పెడతాడో చూడాలి.