The Kerala Story: “ది కేరళ స్టోరీ” సినిమాకు టాక్స్ రద్దు చేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Kerala Story: వివాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది ‘ది కేరళ స్టోరీ’ సినిమా. ఇప్పటికే ఈ సినిమాపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ సినిమా విడుదల చేయకుండా స్టే ఇవ్వాలని పలువురు సుప్రీంకోర్టు, కేరళ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ..కోర్టులు అందుకు నిరాకరించాయి. దీంతో శుక్రవారం దేశవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద భద్రతను కల్పించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ ప్రకటించింది.
‘ది కేరళ స్టోరి’ సినిమాకు టాక్స్ ఫ్రీ ప్రటిస్తున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు ప్రకటించారు. అంతకుముందు శుక్రవారం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ, ఈ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద కుట్రలను బయటకు తీసుకువచ్చినందుకు కాంగ్రెస్, సీపీఎం పార్టీలు ఈ సినిమాపై దాడి చేస్తున్నాయంటూ విమర్శించారు.
Also Read
- Vishwanath and Sons Trailer: 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
- Ritika Nayak : 'కొరియన్ కనకరాజు'తో జాక్పాట్.. టాలీవుడ్కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
- Varun Tej : 'ఎన్టీఆర్ను టార్గెట్ చేయలేదు'.. ట్రోల్స్పై వరుణ్ తేజ్ క్లారిటీ..
- CM Vijay : విజయ్కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
Read Also: Viral : భారీ శ్వేత నాగు.. ఆశ్చర్యపోయిన స్థానికులు.. వీడియో వైరల్
మధ్యప్రదేశ్ లో మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టం చేశా, ఈ సినిమా అవగాహన కల్పిస్తుందనరి అందరు తల్లిదండ్రులు, పిల్లలు ఈ సినిమాను చూాడాలని, అందుకే మధ్యప్రదేశ్ ప్రభుత్వం టాక్స్ ఫ్రీ ప్రకటించిందని సీఎం శివరాజ్ సింగ్ అన్నారు. ‘లవ్ జీహాద్’, ఉగ్రవాదం, మతమార్పిడుల కుట్రల్ని ఈ సినిమా బయటకు తెస్తోందని ఆయన అన్నారు. క్షణికావేశంలో లవ్ జీహాద్ వలలో చిక్కుకుని యువతులు తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటారో ఈ సినిమా చూపిస్తుందని, ఉగ్రవాద కుట్రల్ని బహిర్గతం చేస్తుందని ఆయన అన్నారు. ‘లవ్ జీహాద్’ అనేది ముస్లిం యువకులు, హిందూ యువతులను ట్రాప్ చేసేందుకు చేస్తున్న ఓ కుట్రగా హిందూ అతివాద సంస్థలు ఆరోపిస్తున్నాయి.
కేరళ ఎంతో అందమైన రాష్ట్రం, ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు, ఇలాంటి రాష్ట్రంలో ఉగ్రవాద కుట్రలను కేరళ స్టోరీ బయటకు తెతస్తుందని బళ్లారిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ అన్నారు. దేశాన్ని నాశనం చేయాలనే ఉగ్రవాద ధోరణితో కాంగ్రెస్ ఈ సినిమాను వ్యతిరేకిస్తుందని, కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని మోడీ సూచించారు. అంతకుముందు కేరళ సీఎం పినరయి విజయన్ ఈ సినిమాను ఆర్ఎస్ఎస్ తప్పుడు ప్రచారంగా అభివర్ణించారు.
తాజావార్తలు
-
Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్నినో ప్రభావం’..
-
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్కు స్పష్టం చేసిన భారత్..
-
Vishwanath and Sons Trailer: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
-
Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
-
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!