The Kerala Story: “ది కేరళ స్టోరీ” సినిమాకు టాక్స్ రద్దు చేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Kerala Story: వివాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది ‘ది కేరళ స్టోరీ’ సినిమా. ఇప్పటికే ఈ సినిమాపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ సినిమా విడుదల చేయకుండా స్టే ఇవ్వాలని పలువురు సుప్రీంకోర్టు, కేరళ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ..కోర్టులు అందుకు నిరాకరించాయి. దీంతో శుక్రవారం దేశవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద భద్రతను కల్పించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ ప్రకటించింది.
‘ది కేరళ స్టోరి’ సినిమాకు టాక్స్ ఫ్రీ ప్రటిస్తున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు ప్రకటించారు. అంతకుముందు శుక్రవారం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ, ఈ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద కుట్రలను బయటకు తీసుకువచ్చినందుకు కాంగ్రెస్, సీపీఎం పార్టీలు ఈ సినిమాపై దాడి చేస్తున్నాయంటూ విమర్శించారు.
Also Read
- Dil Raju: 'సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..': ప్రొడ్యూసర్ దిల్ రాజు
- Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
- Trisha: 'తోడు దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా..' పెళ్లిపై త్రిష బోల్డ్ స్టేట్మెంట్!
- Prithviraj Sukumaran: మోహన్లాల్ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
Read Also: Viral : భారీ శ్వేత నాగు.. ఆశ్చర్యపోయిన స్థానికులు.. వీడియో వైరల్
మధ్యప్రదేశ్ లో మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టం చేశా, ఈ సినిమా అవగాహన కల్పిస్తుందనరి అందరు తల్లిదండ్రులు, పిల్లలు ఈ సినిమాను చూాడాలని, అందుకే మధ్యప్రదేశ్ ప్రభుత్వం టాక్స్ ఫ్రీ ప్రకటించిందని సీఎం శివరాజ్ సింగ్ అన్నారు. ‘లవ్ జీహాద్’, ఉగ్రవాదం, మతమార్పిడుల కుట్రల్ని ఈ సినిమా బయటకు తెస్తోందని ఆయన అన్నారు. క్షణికావేశంలో లవ్ జీహాద్ వలలో చిక్కుకుని యువతులు తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటారో ఈ సినిమా చూపిస్తుందని, ఉగ్రవాద కుట్రల్ని బహిర్గతం చేస్తుందని ఆయన అన్నారు. ‘లవ్ జీహాద్’ అనేది ముస్లిం యువకులు, హిందూ యువతులను ట్రాప్ చేసేందుకు చేస్తున్న ఓ కుట్రగా హిందూ అతివాద సంస్థలు ఆరోపిస్తున్నాయి.
కేరళ ఎంతో అందమైన రాష్ట్రం, ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు, ఇలాంటి రాష్ట్రంలో ఉగ్రవాద కుట్రలను కేరళ స్టోరీ బయటకు తెతస్తుందని బళ్లారిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ అన్నారు. దేశాన్ని నాశనం చేయాలనే ఉగ్రవాద ధోరణితో కాంగ్రెస్ ఈ సినిమాను వ్యతిరేకిస్తుందని, కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని మోడీ సూచించారు. అంతకుముందు కేరళ సీఎం పినరయి విజయన్ ఈ సినిమాను ఆర్ఎస్ఎస్ తప్పుడు ప్రచారంగా అభివర్ణించారు.
తాజావార్తలు
-
CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
-
Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
-
Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
-
Maa Inti Bangaram: 73 కోట్ల వసూళ్లతో అన్-స్టాపబుల్ ‘బంగారం’!
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!