నటుడు సిద్ధార్ద్ శుక్లా యంగ్ ఏజ్ లో మరణించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం కన్నుమూసిన ఆయన మృతదేహానికి నేడు పోస్ట్మార్టం పూర్తైయింది. అయితే ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో వైద్యుల సమక్షంలో పోలీస్ అధికారులు పోస్ట్మార్టమును చిత్రీకరించారు. ఈ నివేదిక ప్రకారం సిద్దార్థ్ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన గుండెపోటుతోనే మృతి చెందారని అందరూ భావిస్తున్నారు. అనంతరం అంత్యక్రియలకు సంబందించిన నివేదికను పోలీసులకు అందించారు.
1980 డిసెంబర్ 12న ముంబైలో జన్మించిన శుక్లా ‘హంప్టీ శర్మ కి దుల్హనియా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. హిందీ బిగ్బాస్ సీజన్ 13 విజేతగా నిలిచారు. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్తో టెలివిజన్ స్టార్గా ఎదిగాడు.