Pushpa 2: డిశ్చార్జ్ కానున్న సంధ్య థియేటర్ ఘటన బాధితుడు శ్రీ తేజ్
- మరి కాసేపట్లో కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న సంధ్యా థియేటర్ ఘటన బాధితుడు శ్రీ తేజ
- ఇప్పటికీ పైపు ద్వారా ఆహారాన్ని అందిస్తున్న డాక్టర్లు
- కళ్ళు తెరిచి చూస్తున్నప్పటికీ ఇంకా కుటుంబ సభ్యుల్ని గుర్తుపట్టలేకపోతున్న శ్రీ తేజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఏడాది డిసెంబర్ 4, 2024న హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటన తెలుగు సినిమా ప్రపంచంలో విషాదాన్ని నింపింది. అల్లు అర్జున్ నటించిన పుష్పా 2: ది రూల్ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఈ తొక్కిసలాటలో రేవతి (35) అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీ తేజ (9) తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన తర్వాత గత ఐదు నెలలుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ ఇప్పుడు డిశ్చార్జ్ కానున్నాడు. అయితే, అతడి ఆరోగ్య పరిస్థితి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. రిహాబిలిటేషన్ కోసం రోబోటిక్ ఫిజియోథెరపీ చికిత్సకు పంపనున్నారు.
Read More: Chiranjeevi : ఎన్టీఆర్-నీల్ మూవీ వాయిదా.. చిరంజీవికి తిరుగేలేదు..
Also Read
2024 డిసెంబర్ 4న సంధ్యా థియేటర్లో పుష్పా 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ను చూసేందుకు వేలాది మంది అభిమానులు గుమిగూడారు. అల్లు అర్జున్ తన కారు సన్రూఫ్ నుంచి అభిమానులకు అభివాదం చేయడంతో పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో రేవతి తన కుమారుడు శ్రీ తేజను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయింది. శ్రీ తేజ ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి, తీవ్రమైన మెదడు గాయాలతో కిమ్స్ ఆసుపత్రిలో చేరాడు. శ్రీ తేజ మెదడుకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడంతో అతడి అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి అతడు వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందాడు. గత ఐదు నెలలుగా కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలోని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (PICU)లో ఉన్న శ్రీ తేజకు డాక్టర్లు నిరంతరం చికిత్స అందించారు.
Read More: Lavanya Thripati: ముందు దేశంలోపల శుభ్రం చేయాల్సిన సమయం వచ్చింది
ప్రస్తుతం శ్రీ తేజ వెంటిలేటర్ లేకుండా స్వయంగా శ్వాస తీసుకోగలుగుతున్నాడు, కానీ ఇంకా పైపు ద్వారా ఆహారం అందుకుంటున్నాడు. అతడు కళ్లు తెరిచి చూస్తున్నప్పటికీ, కుటుంబ సభ్యులను గుర్తుపట్టలేకపోతున్నాడు. నాడీ వ్యవస్థలో ఇంకా స్థిరత్వం రాలేదు. డాక్టర్లు ఫిజియోథెరపీ చేస్తున్నప్పటికీ ఆరోగ్యంలో కొంత మెరుగుదల కనిపించడంతో, అతడిని ఇప్పుడు రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రోబోటిక్ ఫిజియోథెరపీ చికిత్సను అందించనున్నారు. ఈ అధునాతన చికిత్స అతడి కదలికలను, సమన్వయాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని వైద్యులు ఆశిస్తున్నారు. ఈ ప్రక్రియ దీర్ఘకాలికం కావచ్చని, కానీ శ్రీ తేజ పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!