Ram Gopal Varma: రెహమాన్ గురించి..షాకింగ్ నిజాలు బయటపెట్టిన ఆర్జీవీ !
ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అటు బాలీవుడ్లో, ఇటు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. గత ఎనిమిదేళ్లుగా హిందీ ఇండస్ట్రీలో తనకు అవకాశాలు తగ్గడానికి కేవలం ‘పవర్ షిఫ్ట్’ మాత్రమే కాకుండా, కొన్ని ‘కమ్యూనల్ ప్రభావాలు’ (Communal influences) కూడా కారణమై ఉండవచ్చని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొనడం సంచలనంగా మారింది. ఇండస్ట్రీలో తనపై జరుగుతున్న కుట్రల గురించి ఆయన పరోక్షంగా స్పందించడంతో, అసలు రెహమాన్ లాంటి దిగ్గజానికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే చర్చ మొదలైంది. దీనిపై సెలబ్రెటిలు కూడా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయం పై మాట్లాడాడు..
Also Read : Sobhita Dhulipalla: లెక్కలు వేసుకుంటే ఇక్కడ రాణించలేం..
Also Read
- Getup Srinu: మేం కాపులం వివాదం.. అంతా ప్రమోషనా?
- Chandrababu - Pawan: సర్జరీ అయిన పవన్'ను పరామర్శించిన చంద్రబాబు
- Police Complaint: సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్!
- JD Chakravarthy: "సాయంత్రం 7:30 దాటితే చాలు.. నాకు బయటి ప్రపంచంతో పనే లేదు".. జేడీ చక్రవర్తి
రామ్ గోపాల్ వర్మ, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ అంటే ఒకప్పుడు ఒక సెన్సేషన్. అయితే రెహమాన్ లాంటి దిగ్గజం తో పని చేయడం అందరి వల్ల కాదని, దానికి ఎంతో ఓపిక కావాలని ఆర్జీవీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. గతంలో బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘై ‘యువరాజ్’ సినిమా కోసం రెహమాన్ను తీసుకున్నప్పుడు జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను వర్మ గుర్తు చేసుకున్నారు. రెహమాన్ పని పూర్తి చేయడంలో చాలా ఆలస్యం చేస్తుంటారని సుభాష్ ఘై కోపంగా ఉండేవారట. ఒకరోజు స్టూడియోకి వచ్చిన రెహమాన్.. అక్కడ సింగర్ సుఖ్వీందర్ సింగ్ కంపోజ్ చేసిన ఒక ట్యూన్ విని, అది బాగుందని సుభాష్ ఘైకి వినిపించారట. అది చూసి షాక్ అయిన ఘై.. ‘నేను నీకు 3 కోట్లు ఇచ్చింది నీ మ్యూజిక్ కోసం, సుఖ్వీందర్ ట్యూన్ కోసం కాదు’ అని రెహమాన్ మీద అరిచారట. దీనికి రెహమాన్ ఏమాత్రం తడబడకుండా చాలా కూల్గా ఒక షాకింగ్ ఆన్సర్ ఇచ్చారట.
‘మిస్టర్ ఘై.. మీరు నాకు ఇస్తున్న 3 కోట్లు నా పేరు కోసం, నా బ్రాండ్ కోసం.. అంతే కానీ కేవలం నా పని కోసం కాదు. ఆ విషయం గుర్తుంచుకోండి’ అని ముఖం మీదే చెప్పేశారట. మీకు నచ్చితే ఈ ట్యూన్ ఉంచుకోండి లేదంటే వేరేది ఇస్తాను అని చెప్పి రెహమాన్ అక్కడి నుంచి చెన్నై వెళ్ళిపోయారట. ఈ విషయాన్ని స్వయంగా సుఖ్వీందర్ సింగ్ తనతో చెప్పినట్లు ఆర్జీవీ వెల్లడించారు. ఆ తర్వాతే అదే ట్యూన్ ‘జై హో’గా మారి ఆస్కార్ గెలుచుకోవడం మరో విశేషం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!