కరన్ జోహర్ బ్యానర్ లో పూరీ సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పనితీరుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. అందుకే జయాపజయాలతో నిమిత్తం లేకుండా హీరోలు, ప్రొడ్యూసర్స్ పూరి జగన్నాథ్ తో వరుసగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా పూరి జగన్నాథ్ పాన్ ఇండియా మూవీ లైగర్ ను తెరకెక్కిస్తున్నాడు. దీనికి బాలీవుడ్ దర్శక నిర్మాత కరన్ జోహార్ నిర్మాణ భాగస్వామి. అయితే… పూరి పనితీరుకు ఫిదా అయిన కరన్ ఆయనతో మరో మూడు సినిమాలకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అప్పట్లో అందులోని నిజానిజాల గురించి ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కానీ ఆ వార్తలు ఒక మేరకు వాస్తవమే అని తెలుస్తోంది. కరన్ జోహార్ తన సొంత బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్ లో ఓ సినిమాకు దర్శకత్వం వహించమని పూరి ని కోరాడట. మరి అందులో హీరోగా నటించే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో లేదో తెలియదు కానీ కరన్, పూరి కాంబోలో మరో మూవీ రావడం మాత్రం ఖాయమని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చాలాకాలంగా పరాజయాలతో ప్రయాణం చేసిన పూరి జగన్నాథ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ కావడంతో తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. అన్నట్టు కొత్త తారలను వెండితెరకు పరిచయం చేయడం అలవాటైన కరన్ జోహార్… పూరి తనయుడు ఆకాశ్ ను పనిలో పనిగా బాలీవుడ్ ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
- NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ - మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
- Pawan Kalyan: 'పవన్ కళ్యాణ్' నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!