Pushpa Team: పుష్ప టీమ్కు మరో షాక్.. హైకోర్టులో ఇంకో పిటిషన్
- పుష్ప టీమ్ కు బిగ్ షాక్..
- కోర్టు కేసులతో ఇబ్బందుల్లో పుష్పరాజ్ యూనిట్..
- పుష్ప టీమ్ పై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa Team: పుష్ప టీమ్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే వరుస ఘటనలు, కోర్టు కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది పుష్పరాజ్ యూనిట్. ఇలాంటి టైమ్ లో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది. పుష్ప-2 సినిమాకు వచ్చిన లాభాలను జానపద కళాకారుల పింఛన్ కోసం కేటాయించాలంటూ లాయర్ నరసింహారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం కింద పిల్ వేశారు. పుష్ప-2 టీమ్ కు భారీగా లాభాలు వచ్చాయని.. ఆ విషయాన్ని మూవీ నిర్మాతలే స్వయంగా ప్రకటించినట్టు ఆయన కోర్టుకు వివరించారు.
Read Also: Minister Kandula Durgesh: రుషికొండ బీచ్లో మళ్లీ బ్లూఫ్లాగ్ జెండాను ఎగరవేస్తాం..
Also Read
- Prakash Raj: "కాక్రోచెస్ ప్రభుత్వాన్ని మోకాళ్లపైకి తెచ్చారు!" : ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
- Apara Mehta : ఎక్కడపడితే అక్కడ టచ్ చేశారు.. సిగరెట్తో కాల్చారు: ప్రాణాపాయంలో పడ్డ నటి!
- Collections : అసలు గ్రాస్, షేర్,నెట్ మధ్య తేడా ఏంటి?
- Chennai Love Story: 'బేబీ'ని మించిన హిట్.. 'చెన్నై లవ్ స్టోరీ'పై కిరణ్ అబ్బవరం, సాయి రాజేష్ ఎమోషనల్ కామెంట్స్
వాస్తవానికి పుష్ప సినిమాకు ఇంత లాభాలు రావడానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బెన్ ఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు కారణం అన్నారు. ప్రభుత్వ సహకారంతోనే ఇంత లాభాలు వచ్చాయి కాబట్టి ఆ లాభాలను సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం జానపద కళాకారుల పింఛన్ కోసం మళ్లించాలన్నారు. తెలంగాణ హోం శాఖ ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి మరీ పర్మిషన్ ఇచ్చిందని.. కాబట్టి ఆ లాభాల్లో వాటాలను పొందే హక్కు జానపద కళాకారులకు ఉందని నరసింహారావు చెప్పుకొచ్చారు. అయితే లాభాల విషయం ఎప్పుడో అయిపోయిందిగా అని కోర్టు ప్రశ్నించగా.. దాని కోసమే ఇప్పుడు పిల్ వేసినట్టు నరసింహారావు చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి కాపీలను సబ్మిట్ చేయాలంటూ కోర్టు రెండు వారాల దాకా విచారణ వాయిదా వేసింది.
Read Also: Posani Krishna Murali: పోసాని క్వాష్ పిటిషన్లపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే పుష్ప-2 టీమ్ మొన్నటి దాకా సంధ్య థియేటర్ ఘటనతో ఉక్కిరి బిక్కిరి అయింది. ఆ ఘటన నుంచి పూర్తిగా బయట పడనే లేదు. ఆ తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నాడు. కానీ సోషల్ మీడియాలో, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇప్పుడిప్పుడే పుష్ప-2 గురించి చర్చ జరగడం ఆగిపోతోంది. ఇలాంటి టైమ్ లో వాటాల గురించి పిల్ వేయడంతో మళ్లీ పుష్ప-2 గురించి మళ్లీ చర్చ మొదలవుతోంది. మరి దీనిపై పుష్ప ప్రొడ్యూసర్లు ఏమైనా స్పందిస్తారో లేదో అనేది చూడాలి.
తాజావార్తలు
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
-
Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!