తెలుగు సినిమా పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’ (OG) పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా రూ. 250 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోందని, త్వరలోనే షూటింగ్ను పూర్తి చేసి విడుదల చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 2025లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ భావిస్తున్నట్టు తెలియడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ‘ఓజీ’ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఒక యాక్షన్ థ్రిల్లర్గా, ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోంది. పవన్ కల్యాణ్ ఈ సినిమాలో ఒక క్రూరమైన గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్గా నటిస్తూ తెలుగు సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. అలాగే, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ మరియు పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ హైప్ను సృష్టించాయి.
Film Journalists: ఫిలిం జర్నలిస్టు సంఘాలతో ఫిలిం ఛాంబర్ కీలక సమావేశం
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. దీంతో ‘ఓజీ’ షూటింగ్ ఆలస్యమైంది. అయితే, తాజా సమాచారం ప్రకారం, పవన్ తన సినిమా కమిట్మెంట్స్ను పూర్తి చేయడానికి సమయాన్ని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నారు. మే-జూన్ నెలల్లో 25 రోజుల షెడ్యూల్తో షూటింగ్ను ముగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు ఈ సినిమాను సెప్టెంబర్ 2025లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ పూర్తయిన వెంటనే పోస్ట్-ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసి, గ్రాండ్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం పవన్ కల్యాణ్ కెరీర్లో అత్యంత ఖరీదైన సినిమాగా నిలవనుంది. ఇప్పటికే డిజిటల్ రైట్స్ రూ. 65-100 కోట్లకు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి, ఇది ఈ సినిమా పై ఉన్న ఆదరణను సూచిస్తోంది.