Tollywood Percentage War: మెగాస్టార్ వద్దకు ఎగ్జిబిటర్ల పంచాయితీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా నిర్మాతలు, నైజాం థియేటర్ ఎగ్జిబిటర్ల మధ్య నడుస్తున్న ‘పర్సంటేజ్ సిస్టమ్’ వివాదం ఇప్పుడు తారా స్థాయికి చేరింది. రెంట్ విధానాన్ని పక్కన పెట్టి కలెక్షన్లను బట్టి పర్సంటేజ్ శ్లాబ్ విధానాన్ని అమలు చేయాలంటూ తెలంగాణ ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన నైజాం థియేటర్ ఎగ్జిబిటర్లు ఈ వివాదం విషయంలో చిరంజీవిని కలుస్తామని కూడా చెప్పారు. ఇక ఈ నేపథ్యంలో, నేడు (సోమవారం) సాయంత్రం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ (PEDDI) జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ఈ వివాదం కారణంగా ‘పెద్ది’ రిలీజ్కు ఇబ్బందులు ఎదురుకాకూడదని ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ మొదట భావించినప్పటికీ.. ఈ సినిమా నుంచే పర్సంటేజ్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ‘పెద్ది’ లాంటి భారీ చిత్రాలకు తాము వ్యతిరేకం కాదని, కానీ ఈ సమస్యను ఇప్పుడే తేల్చకపోతే భవిష్యత్తులో నిర్మాతలు తమను పట్టించుకోరనే ఆందోళనను ఎగ్జిబిటర్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే, ‘పెద్ది’ సినిమాను కూడా పర్సంటేజ్ శ్లాబ్ పరిధిలోకి తీసుకురావాలని, దీనిపై ఒక సానుకూల నిర్ణయం తీసుకునేలా చొరవ చూపాలని వారు చిరంజీవిని కోరనున్నారు. గతంలో కూడా చిత్ర పరిశ్రమకు ఎలాంటి కష్టాలు వచ్చినా, వివాదాలు తలెత్తినా చిరంజీవి గారు ముందుండి నడిపించారు. ఇప్పుడు ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్స్ గిల్డ్ మధ్య ఉన్న ఈ ఇంధన సందిగ్ధతను తొలగించేందుకు ఆయన మధ్యవర్తిత్వం వహించనున్నారని అంటున్నారు.
Also Read
తాజావార్తలు
-
Jio Prime Membership: జియో ప్రైమ్పై పెరుగుతున్న సందేహాలు.. రూ.299, రూ.300 మధ్య తేడా ఏంటి? క్లారిటీ ఇదే..
-
NTR Trivikram: రెండు టైటిళ్లను రిజిస్టర్ చేయించిన ఎన్టీఆర్ ఆర్ట్స్
-
Twisha Sharma: ట్విషా శర్మది హత్యా.. ఆత్మహత్యా? సీబీఐ ఏం తేల్చిందంటే..!
-
Bangladesh: భారత్తో స్నేహం వద్దనుకుంటోందా.? తీస్తాపై బంగ్లాదేశ్ తీరు..
-
Bihar: విద్యార్థి నిరసనకారులపైకి AK-47.. జిల్లా ఎస్పీపై వేటు..
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!