Manjummel Boys: తెలుగులో పెద్ద బ్యానర్లకి షాకిచ్చిన మలయాళ మంజుమ్మెల్ బాయ్స్ టీం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manjummel Boys producers directly releasing their film with Mythri distribution: ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలను నేరుగా తెలుగులో రిలీజ్ చేస్తున్న సంస్కృతి పెరుగుతోంది. ఒకప్పుడు మలయాళ సినీ పరిశ్రమ అంటే చిన్నచూపు ఉండేది కానీ కరోనా సమయంలో తెలుగు వారంతా మలయాళ సినిమాలకు అలవాటు పడ్డారు. దీంతో అక్కడ సూపర్ హిట్ లుగా నిలిచిన సినిమాలను ఓటీటీలో తెలుగు డబ్బింగ్ చేయించి రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఇక నేరుగా థియేటర్లలో కూడా రిలీజ్ చేస్తూ వస్తున్న పరిస్థితులు గమనిస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ఫిబ్రవరి నెలలో మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన భ్రమ యుగం సినిమాని తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ అనుకున్నంత కలెక్షన్స్ రాక పోయినా మంచి పేరు అయితే వచ్చింది. ఇక ప్రేమలు సినిమాని మార్చి 8వ తేదీన తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 22వ తేదీన మలయాళం లో రిలీజ్ అయ్యి ఫాస్టెస్ట్ 100 క్రోర్ గ్రాసింగ్ మలయాళ మూవీగా నిలిచిన మంజుమ్మేల్ బాయ్స్ సినిమాని కూడా తెలుగులో రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది.
Also Read; Rana Naidu: రానా నాయుడు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
Also Read
- Kajal Aggarwal: స్టోరీల ఎంపికపై కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్.. ఆ ఒక్కరి కోసమే కథలు మారుస్తోందట!
- Romanchakam Glimpse: జానకి చెంతనే రాముడి హృదయం.. సందీప్ వంగా 'రోమాంచకం' గ్లింప్స్ నెక్స్ట్ లెవెల్ ఉందిగా!
- Akhil Akkineni: రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్పై కన్నేసిన అఖిల్ అక్కినేని.. మైండ్లో పెద్ద స్కెచ్చే ఉందిగా!
- Naga Vamsi: పర్సంటేజ్ సిస్టమ్ వెనుక కుట్ర! థియేటర్ల మోసాలను బయటపెట్టిన నిర్మాత నాగవంశీ..
నిజానికి ఈ సినిమాని కొని డబ్బింగ్ చేయించి రిలీజ్ చేసేందుకు తెలుగులో కొన్ని బడా బ్యానర్లు కూడా ప్రయత్నించాయి. కానీ సినిమా యూనిట్ మాత్రం ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే డబ్బింగ్ హక్కులు ఎవరికి ఇవ్వకుండా తామే డబ్బింగ్ చేయించి మైత్రి మూవీ మేకర్స్ కి చెందిన మైత్రి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. మార్చి 15వ తేదీన సినిమాని రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఒకరకంగా ఇది తెలుగులో పెద్ద బ్యానర్లకు షాక్ అని చెప్పాలి. మలయాళ చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ మూవీ 11 మంది స్నేహితుల చుట్టూ తిరిగే ఓ సర్వైవల్ థ్రిల్లర్. 2006లో తమిళనాడు కొడైకెనాల్ లో ఉన్న గుణ గుహల్లో జరిగిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాని తరికెక్కించారు. కేరళ కొచ్చి లోని మంజుమ్మేల్ కి చెందిన 11 మంది స్నేహితులు 2006లో తమిళనాడు కొడైకెనాల్ లో ఉన్న గుణ కేవ్స్ కు పర్యటకులుగా వెళ్లారు వెళ్లారు. అందులో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు ఓ లోతైన గుంతలోకి జారిపోతాడు. అతన్ని రక్షించడానికి మిగిలిన స్నేహితులు ఏం చేశారన్నదే ఈ మంజుమ్మెల్ బాయ్స్ స్టోరీ.
తాజావార్తలు
-
IND vs ENG Playing XI: టీమిండియాకు చావో.. రేవో..! నేడే భారత్ – ఇంగ్లాండ్ మూడో టీ20..
-
Lokesh Kanagaraj: LCU ముగియదట.. అభిమానులకే లోకేష్ కనగరాజ్ గట్టి హామీ.. ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్పై క్లారిటీ!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!
-
DSP Bhim Reddy Arrest: DSP భీమ్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ..
-
AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు రద్దు..
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!