Pushpa 2: మహిళ మృతి.. అల్లు అర్జున్ పై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన క్రమంలో సంధ్య థియేటర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్, ఆయన టీం పైన కూడా కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా అల్లు అర్జున్ తీసుకురావడంపై కేసు నమోదు చేసినట్టు చెబుతున్నారు. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది చేసిన హంగామాతో తొక్కిసలాట జరిగినట్టు పోలీసులు తేల్చారు. అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది తోయడం వలెనే తోపులాట జరిగి ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. మధ్య మండల డిసిపి అక్షాంశ్ యాదవ్ మాట్లాడుతూ నిన్న రాత్రి 9.40 సమయంలో పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్య థియేటర్లో ఏర్పాటు చేశారని అన్నారు. దీనికి అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారని, ప్రేక్షకులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు హాజరవుతారని సమాచారం మాకు లేదని అన్నారు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా మాకు ఆ సమాచారం చెప్పలేదు, థియేటర్ యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని అన్నారు. పబ్లిక్ ను కంట్రోల్ చేసేందుకు ఎలాంటి ప్రైవేటు భద్రతను ఏర్పాటు చేయలేదన్న ఆయన ఎంట్రీ, ఎగ్జిట్ లలో కూడా ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని అన్నారు.
Sukumar: రాజమౌళి’ భయపడినంతా అయ్యింది.. సరైనోడు తగిలాడు.. ‘సుకుమార్’ మెంటల్ మాస్!
Also Read
నటీనటుల కూడా ఎటువంటి ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయలేదని, 9.30 కి తన వ్యక్తిగత భద్రత సిబ్బందితో సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ చేరుకున్నారని అన్నారు. ఆ సమయంలో అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లిన సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను నెట్టి వేయడం ప్రారంభించారని, అప్పటికే థియేటర్ లోపల బయట ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉందని అన్నారు. అదే సమయంలో అల్లు అర్జున్ లోపలికి వెళ్లగా ప్రేక్షకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అదే సమయంలో దిల్సుఖ్నగర్ కు చెందిన రేవతి అతని కుమారుడుతో ఆ ప్రాంతంలో ఉంది, అధిక సంఖ్యలో ప్రేక్షకులు ఉండటంతో వారికి ఊపిరాడలేదు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది వారిని బయటకు లాగారు. 13 ఏళ్ల శ్రీతేజ్ కు సిపిఆర్ చేశారు, దుర్గాబాయి దేశముఖ్ ఆసుపత్రి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. శ్రీ తేజను మరో ఆసుపత్రికి తరలించారని అక్కడ వైద్యులు సూచించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాంఅని అన్నారు. బిఎన్ఎస్ యాక్టీవ్ లోని 105 118(1), రెడ్ విత్ త్3(5) సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..