Pushpa 2: మహిళ మృతి.. అల్లు అర్జున్ పై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన క్రమంలో సంధ్య థియేటర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్, ఆయన టీం పైన కూడా కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా అల్లు అర్జున్ తీసుకురావడంపై కేసు నమోదు చేసినట్టు చెబుతున్నారు. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది చేసిన హంగామాతో తొక్కిసలాట జరిగినట్టు పోలీసులు తేల్చారు. అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది తోయడం వలెనే తోపులాట జరిగి ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. మధ్య మండల డిసిపి అక్షాంశ్ యాదవ్ మాట్లాడుతూ నిన్న రాత్రి 9.40 సమయంలో పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్య థియేటర్లో ఏర్పాటు చేశారని అన్నారు. దీనికి అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారని, ప్రేక్షకులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు హాజరవుతారని సమాచారం మాకు లేదని అన్నారు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా మాకు ఆ సమాచారం చెప్పలేదు, థియేటర్ యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని అన్నారు. పబ్లిక్ ను కంట్రోల్ చేసేందుకు ఎలాంటి ప్రైవేటు భద్రతను ఏర్పాటు చేయలేదన్న ఆయన ఎంట్రీ, ఎగ్జిట్ లలో కూడా ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని అన్నారు.
Sukumar: రాజమౌళి’ భయపడినంతా అయ్యింది.. సరైనోడు తగిలాడు.. ‘సుకుమార్’ మెంటల్ మాస్!
Also Read
- Memu COPlam: కోడిపుంజు కోసం పోలీసుల వేట.. నవ్వుల విందుగా నాగబాబు ‘మేము ‘కాప్’లం’ ట్రైలర్!
- Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్కుమార్ విశ్వరూపం!
- Boycott Peddi: మెగా పవర్ స్టార్కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
- Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
నటీనటుల కూడా ఎటువంటి ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయలేదని, 9.30 కి తన వ్యక్తిగత భద్రత సిబ్బందితో సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ చేరుకున్నారని అన్నారు. ఆ సమయంలో అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లిన సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను నెట్టి వేయడం ప్రారంభించారని, అప్పటికే థియేటర్ లోపల బయట ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉందని అన్నారు. అదే సమయంలో అల్లు అర్జున్ లోపలికి వెళ్లగా ప్రేక్షకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అదే సమయంలో దిల్సుఖ్నగర్ కు చెందిన రేవతి అతని కుమారుడుతో ఆ ప్రాంతంలో ఉంది, అధిక సంఖ్యలో ప్రేక్షకులు ఉండటంతో వారికి ఊపిరాడలేదు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది వారిని బయటకు లాగారు. 13 ఏళ్ల శ్రీతేజ్ కు సిపిఆర్ చేశారు, దుర్గాబాయి దేశముఖ్ ఆసుపత్రి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. శ్రీ తేజను మరో ఆసుపత్రికి తరలించారని అక్కడ వైద్యులు సూచించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాంఅని అన్నారు. బిఎన్ఎస్ యాక్టీవ్ లోని 105 118(1), రెడ్ విత్ త్3(5) సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!