Arjun S/O Vyjayanthi: అర్జున్ సన్నాఫ్ వైజయంతి ‘బ్లాక్ బస్టర్’ సెన్సార్ రిపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి కీలక పాత్రలలో నటించిన తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ విజయంతి సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది. రన్ టైమ్ 2 గంటల 24 నిమిషాలుగా నిర్ధారించబడింది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం, ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉంది. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి రూపొందించిన ఈ సినిమాను అశోక క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక వర్ధన్ ముప్ప మరియు సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18, 2025న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం గురించి సెన్సార్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి పడ్డాయి.
Allu Arjun : అల్లు అర్జున్ కు సెలబ్రిటీల బర్త్ డే విషెస్
Also Read
సెన్సార్ రిపోర్ట్ హైలైట్స్:
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మరియు విజయశాంతి అద్భుతమైన నటనతో అలరించారు. విజయశాంతి తన ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో బలమైన తల్లి పాత్రను పోషిస్తూ, కళ్యాణ్ రామ్తో కలిసి ఎమోషనల్ సన్నివేశాల్లో మెప్పించారు. తల్లి-కొడుకు మధ్య సంఘర్షణ కథకు ప్రధాన ఆధారం. విజయశాంతి న్యాయం కోసం పోరాడుతుండగా, కళ్యాణ్ రామ్ తన సొంత మార్గంలో నేరస్థులపై పోరాడటం కథను ఆసక్తికరంగా మలిచిందని అంటున్నారు. ఈ సినిమా హృదయాన్ని తాకే తల్లి-కొడుకు బంధం చుట్టూ తిరుగుతుంది. ఈ సన్నివేశాలు ప్రేక్షకులను ఎమోషనల్గా కట్టిపడేస్తాయని అంటున్నారు. కథ మొత్తం ఎమోషనల్ డెప్త్తో నిండి ఉంది. ప్రతి సన్నివేశంలోనూ భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ అద్భుతంగా రూపొందించబడింది. ఊహించని ట్విస్ట్లతో నిండిన ఈ భాగం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని టాక్. క్లైమాక్స్లో వచ్చే ఒక అనూహ్యమైన మలుపు అత్యద్భుతం అని ఇప్పటి వరకు మనం చూడని ఒక క్లైమాక్స్ ఉంటుందని అంటున్నారు. సినిమా రిచ్ ప్రొడక్షన్ విలువలతో విజువల్ ట్రీట్గా నిలుస్తుంది. ప్రతి ఫ్రేమ్లోనూ నాణ్యత కనిపిస్తుందని టాక్.
కుటుంబ బంధాలు, త్యాగాలు ఈ సినిమాకు సోల్ అని, ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే అంశాలు ఇందులో ఉన్నాయని అంటున్నారు. హై-ఓక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లు సినిమాకు థ్రిల్ ఫ్యాక్టర్ను జోడిస్తాయి. కళ్యాణ్ రామ్ యాక్షన్ అవతార్ అభిమానులను ఆకట్టుకుంటుందని అంటున్నారు. శ్రీకాంత్ విస్సా రాసిన స్క్రీన్ప్లే కథనాన్ని ఆసక్తికరంగా మరియు ఉత్కంఠభరితంగా ముందుకు తీసుకెళ్తుంని, అజనీష్ లోకనాథ్ సంగీతం సినిమాకు ప్రాణం పోయడంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్, యాక్షన్ను మరింత ఎలివేట్ చేస్తుందని అంటున్నారు. సాయి మంజ్రేకర్, సోహైల్ ఖాన్, శ్రీకాంత్ వంటి నటీనటులు కూడా కీలక పాత్రల్లో మెప్పిస్తారు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ సాంకేతికంగా సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయని అంటున్నారు. ఈ సినిమా కళ్యాణ్ రామ్కు మరో బ్లాక్బస్టర్గా నిలిచే అవకాశం ఉంది. ఏప్రిల్ 18, 2025న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు టీంను అభినందించారని అంటున్నారు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్, విజయశాంతి నటన గురించి మాట్లాడారని అంటున్నారు.
తాజావార్తలు
-
Prabhsimran Singh: టెన్షన్ వద్దు, ప్లేఆఫ్స్కు చేరుతాం.. అభిమానులకు పంజాబ్ ప్లేయర్ భరోసా!
-
Peddi: సాలిడ్ మార్క్ క్రాస్ చేసి.. US మార్కెట్లో దుమ్మురేపుతున్న ‘పెద్ది’ .. !
-
Tamil Nadu Assembly: బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి భారీ మద్దతు..!
-
Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
-
బీచ్ లో స్థానిక ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడిన Sanju Samson.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!