Cannes 2022: సినిమా డైలాగ్స్ తో ఆకట్టుకున్న కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ నటీనటుల సందడి ఇంతా అంతా కాదు! దీపికా పదుకునే, తమన్నా, పూజా హెగ్డే, ఊర్వశీ రౌతేలా వంటి అందాల భామలు ఇండియన్ పెవిలియన్ ప్రారంభోత్సవంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తాను తొలిసారి పాల్గొన్నానని చెప్పిన తమన్నా… ఆ అవకాశం తనకు కల్పించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు ధన్యవాదాలు తెలిపింది. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా మూవీ స్టామినా ఏమిటనేది ప్రపంచానికి తెలిసిందని, ఆ చిత్రంలో తాను భాగస్వామి కావడం ఆనందంగా ఉందని చెప్పింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనాలనే కల ఈ రోజు నిజం కావడం సంతోషంగా ఉందన్నది పూజా హెగ్డే.
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!

తాను బ్రాండ్ తో రాలేదని, బ్రాండ్ ఇండియాతో వచ్చానని, భారత దేశ ప్రతినిధిగా కాన్స్ కు హాజరుకావడం గర్వంగా ఉందని తెలిపింది. పదిహేనేళ్ళ క్రితం చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పుడు తన ప్రతిభను ఎవరూ గుర్తించలేదని, అయితే కృషి, పట్టుదలతో ఈ రంగంలో నిలదొక్కుకోవడమే కాకుండా ఇవాళ కాన్స్ జ్యూరీలో సభ్యురాలిగా ఉండటం ఆనందాన్ని కలిగిస్తోందని దీపికా పదుకునే చెప్పింది.

ఇండియన్ పెవిలియన్ ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ మాట్లాడుతూ, ’75 సంవత్సరాల కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతదేశం ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో సరైన భాగస్వామ్యం దక్కింద’ని అన్నారు. ఈ ప్రయాణం మరింత ఫలప్రదంగా ముందుకు సాగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమ దగ్గర కేవలం సినిమా ఇండస్ట్రీ మాత్రమే లేదని సినీ’మా’ ఉందని అన్నారు. అలానే ఇండియన్ పెవిలియన్ ను సందర్శించిన ప్రతి ఒక్కరూ మనసులో ‘ముగాంబా ఖుష్ హువా’ అని అనుకుంటారని చెప్పారు. హిందీ సినిమాల్లోని పాపులర్ డైలాగ్స్ కేంద్రమంత్రి నోటి నుండి రాగానే కార్యక్రమంలో పాల్గొన్నవారు కరతాళ ధ్వనులు చేశారు. కమల్ హాసన్, ఎ. ఆర్. రెహమాన్ తో పాటు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో నటుడు మాధవన్, నవాజుద్దీన్ సిద్ధికి, దర్శకుడు శేఖర్ కపూర్ తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై 2022 నవంబర్ 20 నుండి 28 వరకూ గోవాలో జరుగబోతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా పోస్టర్ ను ఆవిష్కరించారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!