Cannes 2022: సినిమా డైలాగ్స్ తో ఆకట్టుకున్న కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ నటీనటుల సందడి ఇంతా అంతా కాదు! దీపికా పదుకునే, తమన్నా, పూజా హెగ్డే, ఊర్వశీ రౌతేలా వంటి అందాల భామలు ఇండియన్ పెవిలియన్ ప్రారంభోత్సవంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తాను తొలిసారి పాల్గొన్నానని చెప్పిన తమన్నా… ఆ అవకాశం తనకు కల్పించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు ధన్యవాదాలు తెలిపింది. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా మూవీ స్టామినా ఏమిటనేది ప్రపంచానికి తెలిసిందని, ఆ చిత్రంలో తాను భాగస్వామి కావడం ఆనందంగా ఉందని చెప్పింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనాలనే కల ఈ రోజు నిజం కావడం సంతోషంగా ఉందన్నది పూజా హెగ్డే.
Also Read
- God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
- Sunil Narang: 'ఏకాభిప్రాయం లేదు.. ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి' ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ గుడ్ బై!
- Likhitha Reddy: ప్రశాంత్ నీల్ భార్య కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? థియేటర్ లో ఆ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
- Jayam Ravi: జయం రవి విడాకుల కేసులో షాకింగ్ ట్విస్ట్..!

తాను బ్రాండ్ తో రాలేదని, బ్రాండ్ ఇండియాతో వచ్చానని, భారత దేశ ప్రతినిధిగా కాన్స్ కు హాజరుకావడం గర్వంగా ఉందని తెలిపింది. పదిహేనేళ్ళ క్రితం చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పుడు తన ప్రతిభను ఎవరూ గుర్తించలేదని, అయితే కృషి, పట్టుదలతో ఈ రంగంలో నిలదొక్కుకోవడమే కాకుండా ఇవాళ కాన్స్ జ్యూరీలో సభ్యురాలిగా ఉండటం ఆనందాన్ని కలిగిస్తోందని దీపికా పదుకునే చెప్పింది.

ఇండియన్ పెవిలియన్ ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ మాట్లాడుతూ, ’75 సంవత్సరాల కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతదేశం ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో సరైన భాగస్వామ్యం దక్కింద’ని అన్నారు. ఈ ప్రయాణం మరింత ఫలప్రదంగా ముందుకు సాగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమ దగ్గర కేవలం సినిమా ఇండస్ట్రీ మాత్రమే లేదని సినీ’మా’ ఉందని అన్నారు. అలానే ఇండియన్ పెవిలియన్ ను సందర్శించిన ప్రతి ఒక్కరూ మనసులో ‘ముగాంబా ఖుష్ హువా’ అని అనుకుంటారని చెప్పారు. హిందీ సినిమాల్లోని పాపులర్ డైలాగ్స్ కేంద్రమంత్రి నోటి నుండి రాగానే కార్యక్రమంలో పాల్గొన్నవారు కరతాళ ధ్వనులు చేశారు. కమల్ హాసన్, ఎ. ఆర్. రెహమాన్ తో పాటు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో నటుడు మాధవన్, నవాజుద్దీన్ సిద్ధికి, దర్శకుడు శేఖర్ కపూర్ తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై 2022 నవంబర్ 20 నుండి 28 వరకూ గోవాలో జరుగబోతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా పోస్టర్ ను ఆవిష్కరించారు.
తాజావార్తలు
-
AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
-
Rishabh Pant: మేం తోపులం, కానీ కలిసిరాలేదు.. రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
ట్రెండింగ్
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!