Cannes 2022: సినిమా డైలాగ్స్ తో ఆకట్టుకున్న కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ నటీనటుల సందడి ఇంతా అంతా కాదు! దీపికా పదుకునే, తమన్నా, పూజా హెగ్డే, ఊర్వశీ రౌతేలా వంటి అందాల భామలు ఇండియన్ పెవిలియన్ ప్రారంభోత్సవంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తాను తొలిసారి పాల్గొన్నానని చెప్పిన తమన్నా… ఆ అవకాశం తనకు కల్పించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు ధన్యవాదాలు తెలిపింది. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా మూవీ స్టామినా ఏమిటనేది ప్రపంచానికి తెలిసిందని, ఆ చిత్రంలో తాను భాగస్వామి కావడం ఆనందంగా ఉందని చెప్పింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనాలనే కల ఈ రోజు నిజం కావడం సంతోషంగా ఉందన్నది పూజా హెగ్డే.
Also Read
- Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
- Kayadu Lohar: "రాయితో కొట్టి తల పగలగొట్టా".. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
- Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
- Kalki Sequel: 'కల్కి 2' నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!

తాను బ్రాండ్ తో రాలేదని, బ్రాండ్ ఇండియాతో వచ్చానని, భారత దేశ ప్రతినిధిగా కాన్స్ కు హాజరుకావడం గర్వంగా ఉందని తెలిపింది. పదిహేనేళ్ళ క్రితం చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పుడు తన ప్రతిభను ఎవరూ గుర్తించలేదని, అయితే కృషి, పట్టుదలతో ఈ రంగంలో నిలదొక్కుకోవడమే కాకుండా ఇవాళ కాన్స్ జ్యూరీలో సభ్యురాలిగా ఉండటం ఆనందాన్ని కలిగిస్తోందని దీపికా పదుకునే చెప్పింది.

ఇండియన్ పెవిలియన్ ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ మాట్లాడుతూ, ’75 సంవత్సరాల కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతదేశం ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో సరైన భాగస్వామ్యం దక్కింద’ని అన్నారు. ఈ ప్రయాణం మరింత ఫలప్రదంగా ముందుకు సాగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమ దగ్గర కేవలం సినిమా ఇండస్ట్రీ మాత్రమే లేదని సినీ’మా’ ఉందని అన్నారు. అలానే ఇండియన్ పెవిలియన్ ను సందర్శించిన ప్రతి ఒక్కరూ మనసులో ‘ముగాంబా ఖుష్ హువా’ అని అనుకుంటారని చెప్పారు. హిందీ సినిమాల్లోని పాపులర్ డైలాగ్స్ కేంద్రమంత్రి నోటి నుండి రాగానే కార్యక్రమంలో పాల్గొన్నవారు కరతాళ ధ్వనులు చేశారు. కమల్ హాసన్, ఎ. ఆర్. రెహమాన్ తో పాటు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో నటుడు మాధవన్, నవాజుద్దీన్ సిద్ధికి, దర్శకుడు శేఖర్ కపూర్ తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై 2022 నవంబర్ 20 నుండి 28 వరకూ గోవాలో జరుగబోతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా పోస్టర్ ను ఆవిష్కరించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!