Balakrishna: ఆ పొరపాటును మన్నించండి.. బాలయ్య ఓపెన్ లెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna Says Sorry To Deva Brahmins For His Mistake: ఇటీవల తాను చేసిన ఒక పొరపాటుకు గాను నందమూరి బాలకృష్ణ క్షమాపణలు చెప్పారు. తనకు తెలియకుండా చేసిన ఆ తప్పుకు క్షమించాల్సిందిగా కోరుతూ.. దేవబ్రాహ్మణులకు బహిరంగ లేఖ రాశారు. ఇటీవల తన వీరసింహారెడ్డి సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాుతూ.. బ్రాహ్మణులకు దేవళ మహర్షి గురువు అని, వారి నాయకుడు రావణాసురుడు అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై దేవాంగుల కమ్యూనిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చరిత్రను పూర్తిగా తెలుసుకోకుండా బాలయ్య చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఆ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని, బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
North India – Cold: ఉత్తరాది ‘వణుకు’తోంది… ఎందుకో తెలుసా..?
Also Read
- Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన 'యశ్ టాక్సిక్'
- Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
- NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
- Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారంటే?
ఈ విషయం తెలుసుకున్న బాలయ్య.. ఫేస్బుక్ మాధ్యమంగా స్పందించారు. దేవబ్రాహ్మణులకు సారీ చెప్పారు. ‘‘దేవబ్రాహ్మణ సోదరసోదరీమణులకు మీ సోదరుడు నందమూరి బాలకృష్ణ మనఃపూర్వక మనవి. దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని నాకు అందిన సమాచారం తప్పు అని నాకు తెలియజెప్పిన దేవబ్రాహ్మణ పెద్దలందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేనన్న మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను. నాకు ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన లేదు, ఉండదని కూడా తెలుగు ప్రజలందరికీ తెలుసు. దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే. అంతేకానీ సాటి సోదరుల మనసు గాయపరచటం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి. పైగా దేవాంగుల్లో నా అభిమానులు చాలామంది ఉన్నారు. నావాళ్లను నేను బాధపెట్టుకుంటానా? అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను.. పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ తాను రాసిన బహిరంగ లేఖలో బాలయ్య పేర్కొన్నారు.
Nepal Plane Crash: నేపాల్లో కుప్పకూలిన విమానం.. 72 మంది మృతి
కాగా.. సంక్రాంతి కానుకగా వచ్చిన వీరసింహారెడ్డి సినిమా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటించగా.. హనీ రోస్, వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రలు పోషించారు. కన్నడ నటుడు దునియా విజయ్ ప్రతినాయకుడిగా నటించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూర్చాడు.
Hyderabad Roads Empty: సంక్రాంతి ఎఫెక్ట్.. బోసిపోయిన భాగ్యనగరం.. రోడ్లన్నీ నిర్మానుష్యం
తాజావార్తలు
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్లో హతం!
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!