Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Nepal Plane With 72 On Board Crashes 5 Indians Were On Flight

Nepal Plane Crash: నేపాల్‌లో కుప్పకూలిన విమానం.. 72 మంది మృతి

Published Date :January 15, 2023 , 3:01 pm
By Mahesh Jakki
Nepal Plane Crash: నేపాల్‌లో కుప్పకూలిన విమానం.. 72 మంది మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nepal Plane Crash: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. యతి ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా.. ఓ విమానం అదుపుతప్పి నదిలోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 72 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. . దేశ రాజధాని ఖాట్మాండు నుంచి బయలుదేరిన విమానం పొఖారాలో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం సమయంలో ఫ్లైట్‌లో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని యతి ఎయిర్ లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా ప్రకటించారు. కూలిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకుంది. ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఎయిర్ పోర్టును మూసేశారు. ప్రమాదంలో చాలా మంది వరకు చనిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.

నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి సుమారు 72 మందితో ప్రయాణిస్తున్న విమానం పోఖారాలో కూలిపోవడంతో విమానంలోని  అందరూ ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. ఇద్దరు చిన్నారులతో సహా 10 మంది విదేశీ పౌరులు విమానంలో ఉన్నారని అని యతి ఎయిర్‌లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా తెలిపారు. 53 నేపాలీ, 5 భారతీయులు, 4 రష్యన్, ఒక ఐరిష్, ఇద్దరు కొరియన్లు, 1 అర్జెంటీనా, ఒక ఫ్రెంచ్ జాతీయుడు విమానంలో ఉన్నారని వెల్లడించారు. శిథిలాల వద్ద మంటలు చెలరేగడంతో రెస్క్యూ ఆపరేషన్‌లు కష్టంగా ఉన్నాయని నేపాలీ జర్నలిస్ట్ ఒకరు వెల్లడించారు. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ అత్యవసర కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు.

Also Read

  • Scientists disappear: టాప్ డిఫెన్స్ సైంటిస్టులు మాయం.. అమెరికా, చైనాలో టెన్షన్..
  • Hyderabad Metro : మెట్రోపై ప్రభుత్వ హక్కు.. L&Tకి గుడ్‌బై!
  • PBSK Vs DC: SRH రికార్డు కనుమరుగు.. విధ్వంసం స్పష్టించిన పంజాబ్ ఓపెనర్స్..
  • Maoists Surrender : తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన 47 మంది మావోయిస్టులు

Read Also: Flight Crash: నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం.. ప్రమాద సమయంలో ఫ్లైట్ లో 72 మంది

నేపాల్ పౌర విమానయాన అథారిటీ ప్రకారం.. విమానం ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 10:33 గంటలకు బయలుదేరింది. పోఖారా విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు దగ్గరగా ఉన్న విమానం, సేతి నది ఒడ్డున ఉన్న నది లోయలో కూలిపోయింది. టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత క్రాష్ జరిగింది. విమానం కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. రెస్క్యూ సిబ్బంది వాటిని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంతాపం తెలిపారు. “నేపాల్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. నా ఆలోచనలు, ప్రార్థనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. ఓం శాంతి” అని ఆయన ట్వీట్ చేశారు.

Read Also: Army Chief: చైనా సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం..

ఇంతకుముందు నేపాల్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదాల్లో వందలాది మంది మరణించారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మే 2022లో నేపాలీ క్యారియర్ తారా ఎయిర్ నడుపుతున్న విమానంలో మొత్తం 22 మంది వ్యక్తులు.. 16 మంది నేపాలీలు, నలుగురు భారతీయులు, ఇద్దరు జర్మన్లు.. విమానం కూలిపోవడంతో మరణించారు. మార్చి 2018లో.. యూఎస్-బంగ్లా ఎయిర్‌లైన్స్ విమానం ఖాట్మండు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో క్రాష్-ల్యాండ్ అయింది. 51 మంది మరణించారు. 1992లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం ఖాట్మండుకు చేరుకునే సమయంలో కుప్పకూలినప్పుడు అందులో ఉన్న మొత్తం 167 మంది మరణించారు. కేవలం రెండు నెలల క్రితం, థాయ్ ఎయిర్‌వేస్ విమానం అదే విమానాశ్రయానికి సమీపంలో కుప్పకూలింది. 113 మంది మరణించారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • flight crash
  • Kathmandu
  • Nepal
  • nepal flight
  • Nepal Plane Crash

తాజావార్తలు

  • Scientists disappear: టాప్ డిఫెన్స్ సైంటిస్టులు మాయం.. అమెరికా, చైనాలో టెన్షన్..

  • SSC Stenographer: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 731 స్టెనోగ్రాఫర్ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం

  • PM Modi : మే 9న తెలంగాణకు ప్రధాని మోడీ.. పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ.!

  • Hyderabad Metro : మెట్రోపై ప్రభుత్వ హక్కు.. L&Tకి గుడ్‌బై!

  • Diamond Chips Recipe: టీ టైమ్ స్నాక్ అంటే ఇదే.. పర్ఫెక్ట్ ‘డైమండ్ చిప్స్’ ఇలా చేయండి!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions