స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చిన సినిమా ‘పుష్ప ది రైజ్’. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. 350 కోట్లు రాబట్టి పాన్ ఇండియా హిట్ అయిన ‘పుష్ప ది రైజ్’ సినిమా రిలీజ్ అయ్యి 14 నెలలు అయ్యింది. ఇప్పటివరకూ ‘పుష్ప ది రూల్’కి సంబంధించిన ఒక అప్డేట్ ని కూడా మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చెయ్యలేదు. బన్నీ ఫాన్స్ సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసినా సుకుమార్ మాత్రం సైలెంట్ గా ‘పుష్ప ది రూల్’ సినిమా షూటింగ్ చేసేస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక కూడా పుష్ప ది రూల్ సెట్స్ లో జాయిన్ అయిపొయింది. ఫస్ట్ పార్ట్ ని మించి ఉండలా జాగ్రత్తలు తీసుకుంటున్న సుకుమార్, అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక షూటింగ్ లొకేషన్ పిక్చర్ ని కూడా లీక్ కాకుండా చూసుకుంటున్నాడు. ఎట్టకేలకు ఇన్ని రోజుల తర్వాత ఏడాది దాటి రెండు నెలలు అవుతుంది పుష్ప 2 అప్డేట్ ఇవ్వండి అని అడుగుతున్న అభిమానులకి అఫీషియల్ గా అప్డేట్ ఇవ్వడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సంధర్భంగా పుష్ప ది రూల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చెయ్యనున్నారు. ఇదే రోజున ఒక గ్లిమ్ప్స్ ని కూడా రిలీజ్ చేసి ప్రమోషన్స్ ని సాలిడ్ గా కిక్ స్టార్ట్ చెయ్యాలనేది మేకర్స్ ప్లాన్. ఈ గ్లిమ్ప్స్ తో పుష్ప 2 పై ఉండే అంచనాలు అమాంతం పెరుగుతాయి, హైప్ ఆకాశాన్ని తాకుతుంది, చిత్ర యూనిట్ అంతా పుష్ప 2 గ్లిమ్ప్స్ ని చూపించడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం అని అర్ట్ డైరెక్టర్ ఇటివలే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ఏప్రిల్ 8నే అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘దేశముదురు’ సినిమాని కూడా రీరిలీజ్ చెయ్యనున్నారు. అంటే ఒక్క రోజే అల్లు అర్జున్ ఫాన్స్ కి మూడు ఫుల్ మీల్స్ లాంటి న్యూస్ లు బయటకి రానున్నాయి అనమాట.