అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ‘సరైనోడు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసినదే. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మాస్ ఎంటర్ టైనర్ సినిమాల రూపకల్పనకు పెట్టింది పేరైన బోయపాటితో బన్నీ సినిమా కమిట్ అయ్యాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభం అవుతుందట. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
Read Also : మరోసారి ప్రభాస్, రాజమౌళి సినిమా
అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్యాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఆ తర్వాత దిల్ రాజు నిర్మించే ‘ఐకాన్’ షూట్లో పాల్గొంటాడు. ఆ సినిమా దాదాపు పూర్తి చేసి… ఆ తర్వాత బోయపాటి షూటింగ్ ప్రారంభిస్తారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందట. బోయపాటి నందమూరి బాలకృష్ణతో ‘అఖండ’ చిత్రం చేస్తున్నాడు, ఇందులో ప్రగ్యా జైస్వాల్ కథానాయిక కాగా శ్రీకాంత్ విలన్.