బ్యూటీ అనే పదానికి సినోనిమ్ గా ఉండే ఐశ్వర్యరాయ్ బచ్చన్ కి ఒక ల్యాండ్ కి సంబంధించిన టాక్స్ విషయంలో లీగల్ నోటిసులు అందాయి. నాసిక్ జిల్లా సిన్నార్ తాలూకా ఆదివాడి గ్రామంలో ఐశ్వర్యరాయ్ ఒక హెక్టారు భూమి కొనుగోలు చేసింది. ఈ భూమిపై 21,960 టాక్స్ చెల్లించాల్సి ఉంది. నాసిక్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుండి పదేపదే రిమైండర్ వచ్చిన తర్వాత కూడా ఐశ్వర్య టాక్స్ కట్టలేదు. దీంతో ఆమె లీగల్ నోటీసులు పంపించారు. లీగల్ నోటీసు వచ్చిన తర్వాత, ఇప్పుడు ఐశ్వర్యరాయ్ లీగల్ అడ్వైజర్ “అన్ని బకాయిలను క్లియర్ చేస్తానని హామీ ఇచ్చారు.
Read Also: SSMB 28: పాన్ ఇండియా సినిమాకి పునాది పడింది…
ఈ విషయంపై సిన్నార్ తహసీల్దార్ ఏక్నాథ్ బంగాలే మీడియాతో మాట్లాడుతూ. “ఐశ్వర్యరాయ్ విండ్మిల్లో పెట్టుబడి పెట్టింది. 2009లో కొనుగోలు చేసిన భూమికి ఇన్నాళ్లూ ఆమె టాక్స్ చెల్లించింది. ఈ నిర్దిష్ట అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించిన పన్ను మాత్రమే పెండింగ్లో ఉంది. మా ఆదాయ అంచనా సంవత్సరం ఆగస్టు నుండి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరానికి గాను ఆమె కట్టాల్సిన టాక్స్ మాత్రమే పే చెయ్యలేదు. ఈ విషయంలో మేము ఐశ్వర్యరాయ్ కి రెండుసార్లు డిమాండ్ నోటీసు పంపాము కాని స్పందన లేదు. ఇటివలే జనవరి 9న పది రోజుల్లోగా పన్ను చెల్లించాలి అంటూ మరోసారి నోటీసు పంపించాం. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ లీగల్ అడ్వైజర్ రేపటిలోగా పన్ను చెల్లిస్తారని మాకు చెప్పారు” అని చెప్పారు. ఐశ్వరరాయ్ కి మాత్రమే కాదు సిన్నార్ మండల పరిధిలో ఉన్న టాక్స్ కట్టని దాదాపు 1200 మందికి లీగల్ నోటీసులు పంపించారు. వీరిలో సెలబ్రిటిలతో పాటు బిజినెస్ మాన్స్ కూడా ఉన్నారు.
Read Also: Prabhas Maruthi: సైలెంట్ గా కానిచ్చేస్తున్నారుగా…