బాలీవుడ్ మూవీకి జక్కన్న రెడీ… మరి మహేష్ మూవీ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం తాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి, విడుదల చేయాలన్నది జక్కన్న ఆలోచన. అక్టోబర్ 13న విడుదల చేస్తామని ప్రకటించిన ఈ సినిమా మరోసారి వాయిదా పడిన విషయం తెలిసిందే. 2022 జనవరిలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజమౌళి నెక్స్ట్ మూవీ ఏంటన్న విషయంపై అందరి దృష్టి పడింది. అయితే మహేష్ బాబుతో రాజమౌళి మూవీ ఉంటుందని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ తాజా సమాచారం ప్రకారం రాజమౌళి “ఆర్ఆర్ఆర్”ను పూర్తి చేసి ఓ బాలీవుడ్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడట. మరి మహేష్ మూవీ సంగతి ఏంటి ? అనే సూపర్ స్టార్ అభిమానులు ప్రశ్నించొచ్చు. అయితే మహేష్ తో కూడా రాజమౌళి సినిమా ఉంది. కానీ దానికి టైం ఉంది.
Read Also : “లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా ?
Also Read
- Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
- M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
- M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
- Censor: సినిమా రీ-ఎడిటింగ్కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా జనవరిలో రానుంది. ఈ మూవీ అనంతరం మహేష్ కొంచం గ్యాప్ తీసుకుంటాడు. ఆ గ్యాప్ ను రాజమౌళి వాడుకోవాలని చూస్తున్నారట. చిన్న కథతో, స్టార్స్ హడావుడి లేకుండా మూడు నెలల్లోనే సినిమా మొత్తాన్ని పూర్తి చేసి విడుదల చేయాలనేది రాజమౌళి ప్లాన్ అని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఆ తరువాత మహేష్ బాబు, రాజమౌళి భారీ ప్రాజెక్ట్ రూపొందనుంది అంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలు తెరకెక్కించడమే కాకుండా అప్పుడప్పుడూ ఇలా చిన్న చిన్న కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలతో ప్రేక్షకులను అలరించాలన్నది రాజమౌళి ఆలోచన. అయితే ఈ సినిమాకు రాజమౌళి స్వయంగా దర్శకత్వం వహిస్తారా? లేదంటే కేవలం దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు చేపడతారా ? అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..