టాలీవుడ్ లో రీరిలీజ్ సందడి జోరుగా సాగుతుంది. స్టార్ హీరోల ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు రీరిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేస్తున్నారు. ఇటీవల మహేశ్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సలార్ రీరిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ వంతు. బాలయ్య కథానాయకుడిగా రూపొందిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’. సుప్రసిద్ధ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు దర్శకతత్వంలో వచ్చిన ఈ సినిమా మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.
Also Read : Sonal Chauhan : బీచ్ లో సోనాల్ చౌహన్ సొగసులు చూసి తీరాల్సిందే
1991లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమాను 4K డిజిటలైజేషన్, 5.1 సౌండ్తో మరింత అధునాతనంగా మళ్ళీ ప్రేక్షకులకు అందిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ – “నందమూరి బాలకృష్ణ గారు శ్రీకృష్ణ దేవరాయలుగా, కృష్ణ కుమార్గా రెండు విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు ఈ సినిమాను తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దారు. ఇప్పటి టెక్నికల్ హంగులతో మరింత గొప్ప అనుభూతిని అందించేలా రీ రిలీజ్కి సిద్ధమైంది. చక్కని థియేటర్లు లభించడంతో, ముందుగా అనుకున్న ఏప్రిల్ 11న కాకుండా ఏప్రిల్ 4వ తేదీనే రీ రిలీజ్ చేయాలని నిర్ణయించాం’’ అని అన్నారు. ఇండియాస్ మొదటి సైన్స్ ఫిక్షన్ గా వచ్చిన ఈ సినిమా రీరిలీజ్ కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.