Adipurush: ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. ఆదిపురుష్ టీమ్ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush Team Gives Clarity On Ticket Price Issue: ఆదిపురుష్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా నామజపమే! జూన్ 16వ తేదీన విడుదలకు ముస్తాబవుతున్న ఈ సినిమా కోసం యావత్ భారతీయ సినీ ప్రియులు ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన స్టోరీనే అయినప్పటికీ.. ప్రస్తుత ఆధునిక యుగానికి తగ్గట్టు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో డైరెక్టర్ ఓమ్ రౌత్ ఈ ‘ఆదిపురుష్’ని రూపొందించాడు. దీంతో.. ఈ కొత్త ఫార్మాట్ ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఈ గ్యాప్లో ఈ సినిమాకి సంబంధించి ఓ తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని ఖండిస్తూ చిత్రబృందం తాజాగా క్లారిటీ ఇచ్చింది.
Shocking Video: రైలు వస్తుంటే ఎదురెళ్లి.. పట్టాలపై పడుకున్న యువకుడు
Also Read
- Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా... "పోలీస్ కంప్లైంట్" డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
- Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్... స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Tollywood : తెలుగులో అప్పట్లో హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా వరుస ఛాన్సులు
- NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
‘ఆదిపురుష్’ ప్రదర్శించే ప్రతీ థియేటర్లోనూ.. హనుమంతుడికి ప్రత్యేకంగా ఒక సీటును కేటాయిస్తున్నట్టు మేకర్స్ ఇదివరకే తెలిపారు. దీంతో.. ఆ సీటు పక్కనే తమకు సీటు దక్కేలా టిక్కెట్లు కొనాలని, చాలామంది సినీ ప్రియులు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే హనుమంతుడి సీటు పక్కన సీట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రతిఒక్కరూ తమకు ఆ ఖాళీ సీటు పక్కనే కూర్చునే ఛాన్స్ రావాలని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలోనే.. హనుమంతుడి సీటు పక్కన సీట్లకు టికెట్ ధర ఎక్కువ కేటాయిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఇరువైపులా సీట్లకు ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో, వాళ్లకే ఆ సీట్లు దక్కుతాయన్నట్టుగా ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆదిపురుష్ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
East Godavari Road Accident: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
‘‘ఆదిపురుష్ టికెట్ ధరలకు సంబంధించి, సోషల్ మీడియాలో ఓ తప్పుడు వార్త చక్కర్లు కొడుతోంది. హనుమంతుడికి రిజర్వ్ చేసిన సీటు పక్కన సీట్లకు ఎక్కువ ధరలు కేటాయిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఇలాంటి తప్పుడు వార్తల్ని ఎవ్వరూ నమ్మొద్దు. జై శ్రీరామ్’’ అంటూ ఆదిపురుష్ని నిర్మిస్తున్న టీ సిరీస్ సంస్థ ట్విటర్ మాధ్యమంగా స్పష్టతనిచ్చింది. కాబట్టి.. ఎవ్వరూ ఆ సీట్ల కోసం ఎక్కువ డబ్బులు ఇవ్వొద్దు. కాగా.. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటించిన ఈ సినిమా.. జూన్ 16న వరల్డ్వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అవుతోంది.
There are misleading reports circulating in the media regarding #Adipurush ticket pricing. We want to clarify that there will be no differences in rates for seats next to the one reserved for Hanuman Ji! Don't fall for false information!
Jai Shri Ram! 🙏🏹
— T-Series (@TSeries) June 11, 2023
తాజావార్తలు
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?