యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న పౌరాణిక చిత్రం “ఆదిపురుష్” షూటింగ్ అప్డేట్స్ వరుసగా వస్తున్నాయి. వారం రోజుల గ్యాప్ తో ఒక్కొక్కరుగా సినిమాలోని ప్రధాన నటీనటులు సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా తాజాగా “ఆదిపురుష్” సినిమా పూర్తి షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. గత వారం ప్రభాస్, అంతకుముందు వారంతా వరుసగా సైఫ్ అలీఖాన్, కృతి సనన్, సన్నీ సింగ్ షూటింగ్ పూర్తి చేశారు. తాజా అప్డేట్ ప్రకారం నటీనటులందరితో సహా మొత్తం సినిమా చిత్రీకరణ పార్ట్ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందం కేక్ కోసి సెలెబ్రేట్ చేసుకుంది.
Read also : “పుష్ప” : పొగరుబోతు దాక్షాయణిగా అనసూయ లుక్
ఇక “ఆదిపురుష్” చిత్రీకరణ పార్ట్ను పూర్తి చేయడంతో ఇప్పుడు ఫోకస్ పోస్ట్ ప్రొడక్షన్పై పడింది. అతి త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సినిమా విడుదలకు ఇంకా 10 నెలల సమయం ఉంది. కాగా “ఆదిపురుష్”లో ఎక్కువగా గ్రాఫిక్స్ కు ప్రాముఖ్యత ఉండడంతో భారీ విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది. వచ్చే ఏడాది ఆగస్టు 11న “ఆదిపురుష్” ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు.